అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించిన భారత్
హఠాత్తుగా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా.. సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందుకు తార్కాణంగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. ఈ విషయాన్ని నేవీ అధికారులు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం పహల్గామ్ లో ఇస్లామిక్ ఉగ్రదాడి జరిగింది. దీంతో భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఉద్రిక్తతలు కూడా పెరిగిన నేపథ్యంలో నేవీ చేసిన ఈ సన్నద్ధత పరీక్షల వైపు అందరి కళ్లు పడ్డాయి. సముద్ర జలాల్లో ఎప్పుడైనా, ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు తాము సిద్ధమని వీటి ద్వారా నేవీ ప్రకటించినట్లైంది.
ఈ యుద్ధనౌకల్లో కోల్కతా-క్లాస్ డిస్ట్రాయర్లు, నీలగిరి, క్రివాక్-క్లాస్ ఫ్రిగేట్లు ఉన్నాయి. మూడు రోజుల క్రితం ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించారు. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్.. గగనతలంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను నౌకాదళం విడుదల చేసింది.