ఆపరేషన్ సింధూర్ : 9 ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు.. ఎందుకంటే
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ పై ప్రతీకార చర్యలు చేపట్టింది. అందరూ అనుకున్నదే జరిగి తీరుతుందని, మోదీపై విశ్వాసం వుంచాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన రెండు రోజులకే అత్యంత కీలక పరిణామం జరిగింది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం అత్యంత మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లో ని ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 9 ఇస్లామిక్ ఉగ్రవాద స్థావరాలను, వారికి ఉపయోగపడే ఇతర సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసేసింది. పూర్తి కచ్చితత్వంతోనే ఈ దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మేరకు భారత రక్షణ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.
అయితే.. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను కేంద్రంగా చేసుకొనే భారత ఆర్మీ ఈ దాడులు చేసింది. ఆపరేషన్ కోసం ఆర్మీ తొమ్మిది ప్రదేశాలను ఎంపిక చేసుకుంది. భారత్ పై ఉగ్రవాద కుట్రలు, చొరబాటు ప్రయత్నాలు వీటి కేంద్రంగానే జరుగుతున్నాయి.

బహవల్పూర్ :
పాకిస్తాన్ లోని దక్షిణ పంజాబ్ లో వున్న బహవల్పూర్ అనేది ప్రధాన లక్ష్యాలలో ఒకటి. ఇక్కడే అజార్ నేతృత్వంలోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మహ్మద్ ప్రధాన కార్యాలయం వుంది. 2001 పార్లమెంట్ పై దాడి 2019 పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడితో సహా భారత్ లో జరిగిన అనేక ముఖ్య దాడుల వెనుక ఈ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ హస్తం వుంది.
మురిద్కే :
ఈ ప్రాంతంలో లష్కరే తోయ్యబా స్థావరం, శిక్షణా స్థలం కూడా. లాహోర్ కి ఉత్తరాన దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో వుంది.లష్కరే తోయిబా, దాని అనుబంధ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా స్థావరం కూడా. ఈ రెండు సంస్థలకూ ఈ స్థలం నాడీ కేంద్రం. 200 ఎకరాలకు పైగా విస్తరించిన ఈ స్థలంలో ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు, బోధనా కేంద్రాలు, లాజిస్టికల్ సపోర్ట్, మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడే వున్నాయి. 26/11 దాడి చేసిన వారు ఇక్కడే శిక్షణ పొందారు.
కోట్లి :
ఉగ్రవాద శిక్షణా స్థావరం. అలాగే ఉగ్రవాద ప్రయోగ స్థావరం ఈ ప్రదేశం. ఇక్కడి నుంచే ఆత్మాహుతి దళాలు, తిరుగుబాటుదారులకు శిక్షణ అందుతుంది. భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ విషయాన్ని చెబుతూ వస్తోంది. ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో అయినా.. కనీసంలో కనీసం 50 మంది శిక్షార్థులను తయారు చేస్తుంది.
గుల్పూర్ :
రాజౌరి, పూంచ్ దాడులకు ఇది లాంచ్ ప్యాడ్. జమ్మూ కశ్మీర్ లోని రాజౌరి, పూంచ్ లో కార్యకలాపాలకు ఫార్వర్డ్ లాంచ్ ప్యాడ్ గా 2023,2024 లో ఈ ప్రాంతాన్ని పదే పదే ఉపయోగించారని తెలుస్తోంది. ఉగ్రదాడులకు ఇదే ప్రాంతాన్ని ఎంచుకొంటూ దాడులు చేశారు.
సవాయి :
కశ్మీర్ వ్యాలీలో ఉగ్రదాడులకు ఇక్కడి నుంచే చేసినట్లు తెలుస్తోంది. ఎల్ఈటీ శిబిరాలు కూడా వున్నాయి. సోన్ మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ ఉగ్రదాడుల రచన ఇక్కడి నుంచే జరిగిందని తెలుస్తోంది.
సర్జల్, బర్నాలా :
ఈ రెండూ అక్రమ చొరబాటుకు మార్గాలుగా ఉగ్రవాదులు ఎంచుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దు మరియు నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న సర్జల్ మరియు బర్నాలను చొరబాటుకు గేట్వేగా చెబుతుంటారు.
మెహమూనా :
హిజ్బుల్ ముజాహిదీన్కి పట్టున్న ప్రాంతం.ఇక్కడి నుంచే అన్ని ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం. ఇస్లామిక్ ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే కేంద్రం.
ఉగ్రవాద శిక్షణా కేంద్రాల వివరాలు:
1. Markaz Subhan Allah, Bahawalpur – JeM
2. Markaz Taiba, Muridke – LeT
3. Sarjal, Tehra Kalan – JeM
4. Mehmoona Joya, Sialkot – HM
5. Markaz Ahle Hadith, Barnala – LeT
6. Markaz Abbas, Kotli – JeM
7. Maskar Raheel Shahid, Kotli – HM
8. Shawai Nalla Camp, Muzaffarabad – LeT
9. Syedna Bilal Camp, Muzaffarabad – JeM