ఒడిదుడుకులు వచ్చినా.. ప్రపంచానికి భారత్ మార్గం చూపిస్తూనే వుంది : మోహన్ భాగవత్
ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించే దేశం భారత దేశమని, ప్రపంచానికి ధర్మాన్ని అందించే దేశమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.సికార్ జిల్లాలోని రైవాస ధామ్లోని శ్రీ జాంకీనాథ్ బడా మందిర్లో దివంగత పూజ్యమైన రేవాస పీఠాధీశ్వర్ స్వామి రాఘవాచార్య వేదాంతి మహరాజ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ సియాపియా మిలన్ సమరోహ్’ కార్యక్రమంలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చరిత్ర తన కళ్లు తెరవకపోయినా.. అప్పటి నుంచే భారత్ లోని హిందూ ధర్మం ప్రపంచానికి సత్యం, ధర్మం, ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తూనే వుందని, ఇది పురాతన కాలం నుంచి కొనసాగుతోందన్నారు. అయితే కొన్ని సార్లు స్వతంత్రులుగా, సంపన్నవంతంగా, పేదవారిగా,..ఇలా ఒడిదుడుకులు ఎదురైనా… ఈ ప్రవాహనం మాత్రం ఇలాగే కొనసాగిందని అన్నారు.
ప్రపంచానికి ఎప్పుడు ఏ రకమైన అవసరం ఏర్పడినా.. భారత్ మాత్రం సిద్ధంగా వుంటుందని, స్వాతంత్రానంతరం పరిస్థితులు, అప్పటి చరిత్ర చూస్తే.. చరిత్ర ఆధారంగా కూడా పరిశీలిస్తే.. భారత్ వైభవంగా వెలిగిపోతుందని ఎవ్వరూ అనుకోలేదని, కానీ.. ప్రపంచంలో భారత్ ఇప్పుడు ఉన్నత శిఖరాల్లో వుందని హర్షం వ్యక్తం చేశారు.
మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజాస్వామ్యం వుండదని చాలా మంది ఊహించారిన, కానీ .. ప్రజాస్వామ్యం అద్భుతంగా పరిఢవిల్లుతోందని, సంక్షోభాలు ఎదురైనా.. ప్రజలు ప్రతిఘటించి, ప్రజాస్వామ్యాన్ని సజీవంగా వుంచారని అన్నారు.నేడు భారత్ ప్రజాస్వామ్య దేశంగా వుందని, ప్రజాస్వామ్యం విషయంలో అన్ని దేశాల కంటే ముందే వుందని ప్రకటించారు.
సత్యం అనేది ఒక్కటేనని, అయితే ప్రపంచంలో అది వివిధ రూపాల్లో కనిపిస్తుందని, అబద్ధం మాత్రం కొంతకాలం మాత్రమే మనుగడలో వుంటుందన్నారు. అందుకే మన సాధు సంతుల జీవితాలు చాలా ప్రేరణాదాయకమని అన్నారు. ఈ సందర్భంగా పరమహంస జీవితంలోని ఓ ఘట్టాన్ని ఉటంకించారు.రామకృష్ణ జీవితంలోని ఒక సంఘటనను ప్రస్తావిస్తూ ఆయన పంచవటిలో కూర్చుని గంగానదిని చూస్తున్నట్లు వర్ణించారని, చూస్తూ ఉండగా, ఆయన ధ్యానంలో మునిగిపోయి తన చుట్టూ ఉన్న మొత్తం దృశ్యంతో ఏకమయ్యాడని గుర్తు చేశారు.
అదే సమయంలో, ఒక ఆవు తన ముందు ఉన్న పచ్చదనం గుండా వెళ్ళిందని, ఆయన ఏకత్వంలో ఎంతగా మునిగిపోయాడంటే, ఆ ఆవు పాదముద్రలు అతని ఛాతీపై మిగిలిపోయాయిని చెప్పారు. మొత్తం విశ్వంతో ఇంత లోతైన లీనతను సాధించడానికి మనకు గురుకుంజ్ ఉందని డా. భగవత్ తెలిపారు. “ఈ తాళం మన వద్ద ఉంది, ఈ ప్రయోజనకరమైన తాళం ప్రజలందరికీ ఉంది. ఋషులు, సాధువులు అందరూ ఒకటే, అందరూ మనవారే అని భావించారు. మనకు లభించిన గొప్ప ఘనత మొత్తం ప్రపంచానికి ఇవ్వాలి” అని సర్ సంఘచాలక్ తెలిపారు.
కానీ దీనిని మొత్తం ప్రపంచానికి ఇవ్వడానికి ఒకే వ్యక్తి సరిపోడని, దీని కోసం, ఒక దేశం మొత్తం దీనిని తన జీవిత లక్ష్యంగా చేసుకుని జీవించాలని, ఈ లక్ష్యంతో, ఋషులు తమ తపస్సు ద్వారా ఈ దేశాన్ని సృష్టించారని డా. భగవత్ స్పష్టం చేశారు. రాఘవాచార్య జీని గుర్తుచేసుకుంటూ, ఆయన సర్ సంఘచాలక్ అయిన తర్వాతే తాను ఆయనతో అనుబంధం ఏర్పరచుకున్నానని చెప్పారు. తనను కలిసినప్పుడు సమాజం పట్ల అతని ప్రేమ, తపన కనిపించిందన్నారు. సంఘ కార్యక్రమాలకు రాని సాధువులు చాలా మందే వున్నారని, కానీ.. వారందరూ స్వయంసేవకులేనని ప్రకటించారు.