కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి : ట్రంప్ ప్రకటన

భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ప్రకటించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో ఓ పోస్ట్ పెట్టారు. అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు సాగాయని, తక్షణమే కాల్పుల విరమణ చేపెట్టేందుకు ఇరు దేశాలూ అంగీకరించాయని పేర్కొన్నారు. సరైన సమయంలో ఇరు దేశాలు తెలివిగా వ్యవహరించాయన్నారు. అందుకు ధన్యవాదాలు ప్రకటిస్తున్నానని తెలిపారు
అయితే భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ రెండు దేశాల నడుమ జరిగే యుద్ధంలో తాము జోక్యం చేసుకోమంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చిచెప్పడం ఆసక్తికరం. ప్రాథమికంగా అయితే ఇరుదేశాల మధ్య యుద్ధం తమకు సంబంధం లేదని విషయమని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ పేర్కొన్నారు. కానీ అమెరికా మధ్యవర్తిత్వం వహించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *