క్రైస్తవ మత మార్పిడి రాకెట్ బట్టబయలు…తిరగబడ్డ వనవాసీలు..

ఒడిశా, జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో క్రైస్తవ మత మార్పిడి రాకెట్ బట్టబయలైంది. సరిగ్గా రామనవమి పర్వదినం రోజు కియోంఝర్ జిల్లాలోని చంపువా బ్లాక్ లో క్రైస్తవ బోధకులు వెళ్లి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా హిందూ ధర్మంపై లేనిపోని అపోహలను కూడా ప్రచారం చేశారు. ఇవన్నీ చేస్తూ… స్థానికంగా వుండే గిరిజనులను (వనవాసులు) క్రైస్తవంలోకి లాగాలని ప్రయత్నాలు చేశారు. వనవాసులను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నాలు చేశారు.

సరిగ్గా రామ నవమి రోజే ఆ గ్రామంలో టెంట్లను ఏర్పాటు చేశారు క్రైస్తవులు. ఓవైపు రామ నవమి ఉత్సవాలు జరుగుతుండగానే… రెచ్చగొట్టే విధంగా శిబిరంలో లౌడ్ స్పీకర్లు, మైక్రో ఫోన్ల ద్వారా క్రైస్తవ సందేశాన్ని వినిపించడం ప్రారంభించారు. ఇదే సందర్భంలో హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. దీంతో గ్రామస్థుల్లో తీవ్ర కోపాన్ని రగిలించింది.

దీంతో స్థానిక గిరిజనులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తాము మతం మారే ప్రసక్తే లేదని, హిందూ ధర్మంలోనే చివరి వరకూ వుంటామని తేల్చి చెప్పారు. అంతేకాకుండా తమ గ్రామంలోకి వచ్చిన క్రైస్తవ ప్రచారకులకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వెంటనే తమ గ్రామంలో నుండి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేయడంతో క్రైస్తవ మత ప్రచారకులు బిత్తరపోయారు. వారందరికీ ముచ్చెమటలు పట్టించారు స్థానిక గిరిజనులు.

ఆ తర్వాత హిందూ నాయకులు కూడా ఆ గ్రామానికి చేరుకున్నారు. వీరు పోలీసులకు క్రైస్తవ మత ప్రచారకులపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఏడుగురు క్రైస్తవ మత ప్రచారకులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు క్రైస్తవ మత ప్రచారకుల నుంచి లౌడ్ స్పీకర్లు, మైక్రో ఫోన్లు, ఆటోరిక్షాలను స్వాధీనం చేసుకున్నారు.
మోస పూరిత మాటల ద్వారా తమను మతం మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారని గిరిజనులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ మతం తక్కువ మతమని, క్రైస్తవంలోకి మారడం వల్ల జబ్బులు నయమవుతాయని, డబ్బులు కూడా వస్తాయని, జీవితాలు బాగుడపతాయని తమకు పదే పదే చెబుతూ… కొన్ని ప్రయోజనాలను కూడా కల్పిస్తున్నారని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *