ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 31 మంది మావోల మృతి

ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోలు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు కూడా. మరోవైపు మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. గతంలోనూ 41 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనపై బస్తర్ ఐజీ స్పందించారు. ఈ ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మరణించారని ప్రకటించారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, 31 మంది నక్సల్‌ను జవాన్లు మట్టుబెట్టినట్టు ఛత్తీస్‌గఢ్ సీఎం అరుణ్ సావో ధ్రువీకరించారు. సాహజ జవాన్లకు అభినందనలు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్లకు నివాళులర్పిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *