దేశం లో సాధారణం కంటే సగటున 20 శాతం తక్కువ వర్షాలు: ఐఎండీ ప్రకటన

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ కురిసిన వర్షాలపై కేంద్ర వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ యేడాది వర్షాకాల సీజన్‌లో ఇప్పటి వరకు సాధారణం కంటే సగటున 20 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయని వెల్లడిరచింది. మధ్య భారతంలో 29 శాతం వర్షపాతం తక్కువగా నమోదైందని, దక్షిణాదిన మాత్రం సాధారణం కంటే 17 శాతం అధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. వాయవ్య రాష్ట్రాల్లో సాధారణం కంటే 68 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 20 శాతం తక్కువగా నమోదైందని కూడా పేర్కొంది. జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకూ రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే క్రమంలో పడే వర్షాలను సమ్మర్‌ వర్షాలు అని పిలుస్తారని, ఇవి అన్నదాతలకు అత్యంత కీలకమైన వర్షాలని తెలిపింది. సోయా, పత్తి, చెరకు, పప్పు ధాన్యాలు పండిరచే మధ్య భారతంలో వర్షాల కొరత 29 శాతానికి పెరిగిందని అక్కడి అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *