పత్రాలున్నా… ఇస్కాన్ సభ్యులను అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

ఇస్కాన్ సంస్థపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కక్షకట్టిందని మరోసారి రుజువైంది. పాస్ పోర్టులు, వీసాలు, ఇమ్మిగ్రేషన్ పత్రాలు అన్నీ సక్రమంగా వున్నా… ఇస్కాన్ కి చెందిన 63 మంది సభ్యులను భారత్ కి వెళ్లకుండా బంగ్లాదేశ్ నిషేధించింది. ప్రభుత్వ అనుమతి అవసరమంటూ అడ్డుకుంది. ఈ ఘటన ఆదివారం జరిగింది. అన్ని పత్రాలున్నా బెనాపోల్ సరిహద్దు వద్ద ఇస్కాన్ సభ్యులను నిలిపేశారు. అధికారికంగా వారి ప్రయాణానికి అనుమతి లేదంటూ అధికారులు అడ్డుకున్నారు. బెనాపోల్ ఇమ్మిగ్రేషన్ పోలీసు అధికారి ఇంతియాజ్ అహ్సానుల్ క్వాడర్ భుయాన్, వారిని సరిహద్దు దాటనివ్వకూడదని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందాయని చెప్పారని, అందుకే వారిని అడ్డుకున్నట్లు అక్కడి పత్రికలు పేర్కొన్నాయి. అన్నీ చట్టబద్ధమైన, సరైన పత్రాలున్నా… వారి ప్రయాణానికి అనుమతి లేదని ఇంతియాజ్ అహ్సానుల్ పేర్కొన్నారు.భారత్ కి వాళ్లు ప్రయాణం కావడంపై తమకు కొన్ని అనుమానాలున్నాయని, అందుకే వారికి అనుమతి లేదన్నారు.
బంగ్లాదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి 54 మంది ఇస్కాన్ భక్తుల బృందం మరియు మరో 9 మంది భక్తుల బృందం శనివారం రాత్రి మరియు ఆదివారం ఉదయం మధ్య చెక్‌పాయింట్‌కు చేరుకున్నారు. క్లియరెన్స్ కోసం గంటల తరబడి వేచివున్నారని, చాలా సేపు తర్వాత ప్రయాణానికి అనుమతి లేదని విమానయాన అధికారులు అన్నారని ఇస్కాన్ సభ్యులు ఆరోపించారు. భారత్ లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి బయల్దేరామని, అయితే..ప్రయాణానికి అనుమతి లేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపేశారని ఇస్కాన్ సభ్యుడు సౌరభ్ తపండర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *