పిస్తోలుతో వైష్ణోదేవి ఆలయంలోకి మహిళ
అత్యంత ప్రఖ్యాతమైన శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయంలోకి ఓ మహిళ పిస్టోల్ తో ప్రవేశించింది. భద్రతా తనిఖీలను దాటుకొని పిస్టోల్ తో ప్రవేశించడం గమనార్హం. అయితే.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15 న ఓ మహిళ పిస్టోలుతో ప్రవేశించింది. దీన్ని గమనించి అధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె పేరు జ్యోతి గుప్తాగా గుర్తించారు. గడువు ముగిసిన లైసెన్స్ పిస్టోలును దేవాలయంలోకి తీసుకొచ్చినందుకు ఆమెపై కేసు నమోదైంది. ఈ విషయంపై ఎస్పీ పర్మీందర్ సింగ్ మాట్లాడారు. గడువు ముగిసిన తర్వాత కూడా లైసెన్స్ పిస్తోలును తీసుకొచ్చినట్లు తేలిందన్నారు. అందుకే ఆయుధ చట్టం కింద కత్రా పీఎస్ లో కేసు నమోదు చేశామన్నారు. ఆ పిస్టోలును స్వాధీనం చేసుకున్నామని, ఆలయ భద్రతను పెంచామన్నారు.