ప్రారంభమైన ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలు

బెంగళూరు వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధుల సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే సమావేశాలు జరిగే సభా మండపంలో వున్న భారత మాత చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. దీని తర్వాత మోహన్ భాగవత్ ఈ సమావేశాలను ప్రారంభించారు. ప్రతినిధులందరూ ‘‘సంఘటనా మంత్రం’’ జపించారు. ఈ నెల 21,22,23 తేదీల్లో ఈ సమావేశాలు జరుగుతాయి.
ఈ సభలకు ప్రతినిధులు, వివిధ స్థాయిలో వున్న పదాధికారులు, కార్యకర్తలు హాజరయ్యారు. మొత్తం 1450 ప్రతినిధులు హాజరయ్యారు. 23 వ తేదీ సాయంత్రం వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు ప్రతి యేడాదీ జరుగుతాయని, సంఘ దృష్టిలో, నిర్ణయాత్మక దృష్టికోణంలో చూస్తే…. ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం వుంది.

ఈ సమావేశాల్లో మొదటి రోజు సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే గత యేడాది రిపోర్టును ప్రతినిధుల ముందు వుంచుతారు. అలాగే గత యేడాది దైనందిన శాఖ రిపోర్టులు, వివిధ కార్యక్రమాల నివేదిక కూడా వుంచుతారు. వీటితో పాటు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలు, ఉపక్రమాలు, విశేష కార్యక్రమాల్లో స్వయంసేవకులు పోషించిన భూమిక పై విశ్లేషణలు, చర్చలు కూడా జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *