బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి : తెలంగాణ వ్యాప్తంగా VHP నిరసనలు
బెంగాల్ వ్యాప్తంగా హిందువులే లక్ష్యంగా ముస్లిం ఛాందసులు చేస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసింది. బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న మారణకాండను నిలువరించడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ విషయాన్ని,వినతి పత్రాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. బెంగాల్ లో రాక్షస పాలన కొనసాగుతోందని, హిందువులే లక్ష్యంగా ముస్లిం ఛాందసులు హింసను కొనసాగిస్తున్నారని విరుచుకుపడ్డారు.
ఈ మారణ హోమాన్ని నిలువరించడంలో బెంగాల్ సర్కార్ విఫలమైందని, అందుకే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధన్యతినిస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడం తగని అన్నారు. వారం రోజులుగా వక్ఫ్ చట్టం నిరసలన సాకుతో హిందువులపై ముస్లిం ఛాందసులు హింస చేస్తున్నారని విరుచుకుపడ్డారు.సున్నితమైన బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం గల బెంగాల్ లో కశ్మీర్ తరహా హిందువుల ఊచకోత సాగుతోందన VHP ఆవేదన వ్యక్తం చేసింది.హిందువులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వలస వెళ్లిపోతున్నారని, కొన్ని ప్రాంతాలలో అయితే హిందువులను తరిమేస్తున్నారని మండిపడ్డారు.ఇంత జరుగుతున్నా… ముఖ్యమంత్రి స్థానంలో వున్న మమతా బెనర్జీ తీసుకున్న చర్యలు మాత్రం శూన్యమన్నారు.