మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

దాదాపు ఏడాది తర్వాత మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఫిబ్రవరి 13, 2025 నుండి మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, 60 మంది సభ్యుల శాసనసభను తాత్కాలికంగా నిలిపివేశారు. అసెంబ్లీ పదవీకాలం 2027లో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియమితులైన బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ ఎన్డీయే బృందంతో కలిసి రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో సమావేశమయ్యారు. ఏన్డీయే ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేకుందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు ఎన్డీయే తీర్మాన కాపీని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *