రంగంలోకి ”టెరిటోరియల్ ఆర్మీ”.. కేంద్రం ప్రత్యేక అధికారాలు

పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రక్షణ మంత్రి నేతృత్వంలో శుక్రవారం మరో కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో ఆర్మీకి చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ కి కేంద్రం మరిన్ని అధికారులను అప్పగించింది. సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్‌ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని నిర్ణయించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా వుండాలని కేంద్రం సూచించింది. ఇందులోని అధికారులు, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలిపించేందుకు భారత ఆర్మీ చీఫ్‌కు అధికారం కల్పించింది. టెరిటోరియల్ ఆర్మీ రూల్ 1948 కింద కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెగ్యులర్‌ ఆర్మీతో కలిసి టెరిటోరియల్ ఆర్మీ పనిచేస్తుంది.
టెరిటోరియల్ ఆర్మీ అంటే…
దేశంలో క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు భారత ఆర్మీతో కలిసి శత్రువులతో తలపడడానికి సిద్దంగా వుంటారు. ఇందులోని సిబ్బంది, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ వుంటుంది. అయితే.. తమ తమ ఉద్యోగాలు చేసుకుంటూనే వాలంటరీగా సైన్యంతో పనిచేస్తారు. ప్రస్తుతం 50 వేల మంది వరకూ ఈ టెరిటోరియల్ ఆర్మీలో వున్నట్లు సమాచారం. వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే. కానీ నిరంతరం సైన్యంలో వుండరు. అవసరమైన సమయంలో అంటే ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ సమాయాల్లో రంగంలోకి దిగుతారు.
rahnath
ఇప్పటికి మూడు సార్లు రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ
ఇప్పటి వరకు మూడు సార్లు టెరిటోరియల్ ఆర్మీ సిబ్బంది యుద్ధాల్లో పాల్గొంది. 1962,1965,1971 యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి పనిచేశారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగాను సేవలు అందించారు. ఇటీవలే కేరళ వరదల్లో నటుడు మోహన్ లాల్ తనవంతు సేవలు అందించారు. అతడు కూడా టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో వున్నారు. అలాగే మాజీ కెప్టెన్ ధోని, సచిన్ పైలట్, కపిల్ దేవ్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా లాంటి వారు ఈ హోదాలో వున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *