రాజకీయాల కోసం వక్ఫ్ నిబంధనలను కాంగ్రెస్ మార్చేసింది : ప్రధాని మోదీ

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ స్వప్రయోజనాల కోసం వక్ఫ్ చట్టంలోని నిబంధనలను మార్చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు ముస్లిం ఛాందసవాదులను బుజ్జగించడం మాత్రమే కాంగ్రెస్‌కు తెలుసునని, కొత్త చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ప్రధాని మోదీ హర్యానాలోని హిస్సార్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

వక్ఫ్‌ ప్రాపర్టీగా లక్షలాది హెకార్టులు ఉన్నాయని మోదీ చెప్పారు. వక్ఫ్ ఆస్తులను నిజాయితీగా ఉపయోగిస్తే ముస్లిం యువత బతకుతెరువు కోసం సైకిల్ పంక్చర్లు వేసుకోవాల్సి అవసరం లేదన్నారు. ఈ ఆస్తుల వల్ల కొందరు ల్యాండ్ మాఫియా మాత్రమే లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. ఈ మాఫియా దళితులు, వెనుకబడిన వర్గాలు, వితంతువుల భూములు లూటీ చేస్తున్నారని, వక్ఫ్ చట్టంలో మార్పుల తర్వాత పేదల భూముల లూటీలు ఆగిపోతాయని ప్రకటించారు. కొత్త వక్ఫ్ చట్టంతో గిరిజనులకు చెందిన భూముల జోలికి వక్ఫ్ బోర్డు వెళ్లలేదని, పేద ముస్లింలు, పస్మాండ ముస్లింలు తమ హక్కులను పొందగలుతారు. ఇదే నిజమైన సామాజిక న్యాయం అని మోదీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *