రాలిన ఆకులు, పువ్వులు, రేమ్మలే చక్కని ఎరువులు.. రైతులకు ఖర్చు తక్కువ…
రసాయనిక వ్యవసాయం భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారి. రసాయనిక విషతుల్య ఆహారం తిని, మన దేశంలోని ప్రజలు బలహీనమవుతున్నారు. దీంతో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అలాగే రైతులు కూడా ఆర్థికంగా చాలా కష్టపడుతున్నారు.దీనికి ప్రత్యామ్నాయం ఒక్కటే.. ప్రకృతి వ్యవసాయం. అత్యంత ఖర్చు తక్కువ. రైతుకు దిగుబడి కూడా ఎక్కువే. కళ్లు, ముక్కు, చెవులు, చేతులు, కాళ్లు, నోరు మన దేహంలోని భాగాలను ఇంద్రియాలంటాం కదా. అంటే కేవలం మన శరీరానికి సంబంధించిన భాగాలు మాత్రమే. వీటిని ‘‘స ఇంద్రియాలు’’ అంటాం.
మన దేహంలో మాదిరిగానే చెట్టుకు సంబంధించినంత వరకు ఆకులు, పువ్వులు, కాయలు సేంద్రీయ పదార్థాలవుతాయి. చెట్టు నుంచి రాలిన ఆకులు, పువ్వులు, కాయలే నేలపై పడిన కొంత కాలానికి ఎరువులుగా మారుతాయి. వీటినే సేంద్రీయ (ఆర్గానిక్) ఎరువులు అనాలి. ఇప్పుడు చెప్పండి. ఎక్కడి నుంచో కొని తెచ్చి పొలంలో వేసే వాటిని సేంద్రీయ ఎరువులనడం సమంజసం కాదు. దేశ వ్యాప్తంగా రైతన్నలు తెలసీ తెలియక విచక్షణారహితంగా వాడుతున్న సేంద్రీయ, రసాయనిక ఎరువుల వల్ల లక్షలాది ఎకరాల భూములు సారాన్ని కోల్పోతున్నాయి.