రుణం కావాలంటూ సోషల్ మీడియాలో పాక్ పోస్టు… నెటిజన్లు వెక్కిరింత

ఆపరేషన్ సిందూర్ ప్రభావం దాయాది పాకిస్తాన్ పై తీవ్రంగా పడింది. మేకపోతు గాంభీర్యం, బడాయిమాటలు పైకి చెబుతున్నా… ఆర్థిక పరిస్థితి మాత్రం మొత్తం దిగజారిపోయింది. పైగా ఇప్పుడు భారత్ తో పోరాడాల్సిన సమయం. దీంతో పాకిస్తాన్ రుణాల కోసం అడుక్కుంటోంది. అంతర్జాతీయ సంస్థలను రుణం కావాలని ప్రాధేయపడుతోంది. తమకు ఆర్థిక సాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తోంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని, స్టాక్స్ మార్కెట్ పతనమైందని, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నామని, తమకు సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగానే అడుగుతోంది. అయితే.. ఇదే సమయంలో భారత్ పై తన అక్కసును వెళ్లగక్కింది.
దీంతో సీన్ పూర్తిగా రివర్సైంది. నెటిజన్స్ పాకిస్తాన్ ను కడిగిపారేస్తున్నారు. ఏ మోహం పెట్టుకొని, రుణాలు అడుగుతున్నారంటూ ఏకిపారేస్తున్నారు. దీంతో పాకిస్తాన్ పరువంతా పోయినట్లైంది. పరిస్థితిని గమనించిన పాక్… తాము రుణాల కోసం ఏ పోస్టూ పెట్టలేదని, తమ ఎక్స్ ఖాతా హ్యాక్ అయ్యిందంటూ ప్రకటించింది. తమ ఆర్థిక శాఖ ఎలాంటి పోస్టూ చేయలేదని చెప్పుకొచ్చింది. మరోవైపు పాకిస్తాన్ పెట్టిన ఈ పోస్టుకు భారత ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఘాటుగా స్పందించింది. పాక్ పోస్టును ట్రోల్ చేసి, ప్రసిద్ధ హిందీ కామెడీ చిత్రం ‘‘గోల్ మాల్’’ నుంచి ఓ మీమ్ ను షేర్ చేసింది. ‘‘ఏ కోయి తరిఖా హై భీక్ మాంగ్నే కా’’ (ఇదేనా అడుక్కునే పద్ధతి?) అంటూ పోస్ట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *