లాహోర్ లో పేలుళ్లు… భయంతో పరుగులు తీసిన ప్రజలు
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ తరుణంలో పాక్ నగరం లాహోర్ లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఆపరేషన్ సిందూర్ జరిగిన మరుసటి రోజే ఈ భారీ శబ్దాలు వినిపించాయి. లాహోర్ లోని వాల్టన్ ఎయిర్ పోర్టులో గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా శబ్దాలు వినిపించాయి. దీంతో సైరన్ల మోత మోగింది. వీటితో ప్రజలు భయాందోళనకు గురై, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీ పేలుళ్లతో ఆ ప్రాంతంలో పొగ కమ్ముకుంది. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దీంతో సియాల్ కోట్, లాహోర్ విమానాశ్రయాల్లో విమానాలను సస్పెండ్ చేశారు.ఈ పేలుళ్ల కారణంగా లాహోర్లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసిశారు. అలాగే, కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం, సియాల్కోట్ విమానాశ్రయాలను కూడా మూసేశారు. పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ (PAA) ప్రకారం.. గత రాత్రి అన్ని విమానాశ్రయాలు సాధారణంగానే పనిచేశాయి. తాజా పేలుళ్ల తర్వాత భద్రతా కారణాల వల్ల విమాన రాకపోకల్ని ఆపేశారు.