సంభాల్ లో జామా మసీదు చుట్టూ టార్పాలిన్ షీట్లు
హోళీ, రంజాన్ పండుగల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఉత్తరప్రదేశ్లోని సంభాల్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా జామా మసీదు చుట్టూ టార్పాలిన్ షీట్లు కట్టారు. హోలీ పండుగ రంగులు పడకుండా పీస్ కమిటీలతో సంప్రదించి ఈ చర్యలు తీసుకున్నారు. రంజాన్ మాసం శుక్రవారంనాడే హోలీ పండుగ రావడంతో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. గత ఏడాది జామా మసీదు సర్వేకు కోర్టు ఆదేశాలివ్వడం, సర్వేకు అధికారులు వెళ్లినప్పుడు పెద్దఎత్తున హింసాకాండ జరగడం, పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికార యంత్రాంగం తగు జాగ్రత్తలు తీసుకుంది.