సహనాన్ని అలుసుగా తీసుకోకండి : రాజ్ నాథ్ వార్నింగ్

పాపి పాకిస్తాన్ కి భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్ సహనాన్ని అలుసుగా తీసుకుంటే ఆపరేషన్ సిందూర్ తరహా చర్యలకు సిద్ధంగా వుండాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ మాధ్యమంగా భారత సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ గా చేసుకొని, ధ్వంసం చేశాయి. కానీ పాకిస్తాన్ మాత్రం తద్భిన్నంగా భారత పౌరులే దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ పాకిస్తాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
నేషనల్ క్వాలిటీ కాంక్లేవ్ పేరుతో గురువారం ఓ కార్యక్రమం జరిగింది. అందులో రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్ పై నిప్పులు చెరిగారు. తాము ఎల్లప్పుడూ పూర్తి సంయమనంతోనే వ్యవహరిస్తామని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న సూత్రానే విశ్వసిస్తామన్నారు. అలాగని తమ ఓపికను దుర్వినియోగం చేస్తే కుదరదని, తమ సహనాన్ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఆపరేషన్ సిందూర్ మాదిరిగానే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించారు.
“మా సార్వభౌమత్వాన్ని ఎవరు సవాల్ చేయలేరు. ఒక వేళ అలా అనుకుంటే ఊరుకునేది లేదు. దాడులకు ప్రతి దాడులు తప్పవు. దేశ సమగ్రత, భద్రతే మాకు ముఖ్యం. మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నాం.” అని రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ కు తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందన్న ఆయన.. భారతదేశ సహనాన్ని పరీక్షించొద్దని పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *