స్వయం సేవక్ రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య కేసులో పిఎఫ్‌ఐ ఉగ్రవాది నవాస్‌కు మరణశిక్ష

బిజెపి రాష్ట్ర నాయకుడు , స్వయంసేవక్ రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య కేసులో నిందింతుడైన పిఎఫ్ఐ ఉగ్రవాదికి నవాస్ కు మరణశిక్షను విధించింది కోర్టు. . అలప్పుజ జిల్లాలోని రంజిత్ నివాసంలో జరిగిన దారుణ హత్యలో నవాజ్ పాత్రకు మావెలిక్కర అదనపు సెషన్స్ కోర్టు నవాజ్‌ను దోషిగా నిర్ధారించింది. ముందురౌండ్ విచారణ సమయంలో నవాజ్ వైద్య చికిత్స పొందుతున్నాడు.
అంతకుముందు, గత సంవత్సరం జనవరి 30న, ఇదే కేసులో ప్రమేయం ఉన్నందుకు నిషేధిత ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)తో అనుబంధంగా ఉన్న మరో 15 మంది PFI ఉగ్రవాదులకు కోర్టు మరణశిక్ష విధించింది. కేరళ చరిత్రలో ఒకే తీర్పులో ఇంత మంది వ్యక్తులకు మరణశిక్ష విధించిన మొదటి సందర్భం ఇదే. PFIకి కేరళ ప్రభుత్వం మద్దతు ఇచ్చినప్పటికీ న్యాయమూర్తి VG శ్రీదేవి ఈ తీర్పును వెలువరించారు.
కేరళలో బిజెపి రాష్ట్ర నాయకుడు, స్వయం సేవక్ అయిన రంజిత్ శ్రీనివాసన్‌ను డిసెంబర్ 19, 2021న పిఎఫ్‌ఐ ఉగ్రవాదులు తన సొంత ఇంట్లోనే నిర్దాక్షిణ్యంగా నరికి చంపారు. ఈ దాడి అతని తల్లి, భార్య , చిన్న కుమార్తె ముందే జరిగింది, ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. జాతీయవాద సంస్థలలో అతని చురుకైన భాగస్వామ్యం కారణంగా అతన్ని హత్య చేశారు. దీనిపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాంతో కేరళ పోలీసులు PFI, దాని రాజకీయ విభాగం, SDPI సభ్యులను అరెస్టు చేయవలసి వచ్చింది, వారు చాలా జాగ్రత్తగా ప్రణాళిక చేయబడిన రాజకీయ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని పోలీసుల విచారణలో వెళ్లడయింది. ఈ భయంకరమైన ఇస్లామిక్ టెర్రర్ చర్యలో మరణశిక్ష పడిన వారిలో నిజాం, అజ్మల్, అనూప్, ముహమ్మద్ అస్లాం, సలాం పొన్నాద్, అబ్దుల్ కలాం, సఫరుద్దీన్, మున్షాద్, జసీబ్ రాజా, నవాజ్, షమీర్, నజీర్, జాకీర్ హుస్సేన్, షాజీ పూవతింకల్, షమ్నాజ్ అష్రాఫ్ ఉన్నారు. తాజాగా ఇప్పుడు నవాజ్ కు ఉరిశిక్ష ఖరారైంది.
రాజకీయ జిహాద్ , మతపరంగా ప్రేరేపించబడిన హింసకు వ్యతిరేకంగా బలమైన సందేశంగా తీ తీర్పు పరిగణించబడుతుంది. కోర్టు నిర్ణయం రంజిత్ శ్రీనివాసన్ వారసత్వానికి నివాళిగా , ద్వేషం ,రక్తపాతంపై అభివృద్ధి చెందుతున్న PFI వంటి తీవ్రవాద సంస్థలకు కఠినమైన హెచ్చరికగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *