స్వామి లక్ష్మణానంద సరస్వతీ సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మినీ మారథాన్

శ్రీకృష్ణ జన్మాష్టమి, స్వామి లక్ష్మణానంద సరస్వతీ బలిదాన్ దివస్ సందర్భంగా భువనేశ్వర్ లో మినీ మారథాన్ రన్ జరిగింది. స్వామి లక్ష్మణానంద సరస్వతీ సంస్మృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మారధాన్ కి దాదాపు 3,000 మంది యువకులు హాజరయ్యారు. స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ మారథాన్ స్థానిక వీధులుగా సాగి, తిరిగి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి చేరుకుంది. ఈ మారథాన్ తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలో సంకల్ప్ సభ జరిగింది. ఈ సంకల్ప సభలో స్వామి శారదానంద సరస్వతీ మహారాజ్, స్వామి శంకరానంద గిరి మహారాజ్, మహంత్ రామకృష్ణ దాస్ మహారాజ్, బాబా రమేష్ మహారాజ్ మహిమా అలేఖ్ గఢి, స్వామి జిగ్నానంద సరస్వతీ మహారాజ్, స్వామి నిర్భనానంద గిరి, మహంత కృష్ణ గోపాల్ దాస్ మహారాజ్, చైతన్య మహారాజ్ తదితరులు స్వామిజీలు, సంతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామి లక్ష్మణానంద సరస్వతీ స్వామి వారి జీవిత ప్రయాణం గురించి సాధులు వివరించారు. 1965 లో హిమాలయాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఒడిశా కేంద్రంగా గోహత్య, మత మార్పిళ్లకు వ్యతిరేకంగా స్వామీజీ పోరాడారని, జీవితాన్ని సమర్పించారని గుర్తు చేసుకున్నారు.1968 లో కంధమాల్ కి మారారని, అక్కడ నాలుగు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా సామాజిక, మత, ఆర్థిక అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. నిస్వార్థమైన సేవ ద్వారా, ప్రయత్నాల ద్వారా అక్కడి ప్రజలను సంఘటిత పరిచారన్నారు. అలాగే చక్పాడ మరియు జలేష్పటాలలో రెసిడెన్షియల్ కాలేజీల ద్వారా విద్యా రంగానికి గణనీయమైన కృషి చేశారని గుర్తు చేశారు. వీటితో పాటు కంధమాల్ జిల్లాలోని అన్ని గ్రామాలలో సత్సంగ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక సత్సంగాల ద్వారా వేలాది మంది గిరిజనులను ఏకం చేశారని, వారిని వ్యసనాల బారినుంచి బయటపడేశారని సాధువులు పేర్కొన్నారు.
ఇక వీటన్నింటితో పాటు ముఖ్యంగా గిరిజన, వనవాసీ సంస్కృతిని కాపాడుతూ.. క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా, వారి మత మార్పిళ్లకు వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశారని పేర్కొన్నారు. స్వామీజీకి సాహిత్యం, తత్వశాస్త్రం, వ్యవసాయం, పశుపోషణ, పండ్ల పెంపకంలో మంచి ప్రావీణ్యం వుండేదని సాధు సంతులు తెలిపారు.,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *