హిందూ ఐక్యత కోసం అంబేద్కర్, డాక్టర్జీ తమ జీవితాలను ధారబోశారు : మోహన్ భాగవత్

అంబేద్కర్, హెడ్గేవార్ ఇద్దరూ తమ జీవితాలను హిందూ సమాజంలో ఐక్యత, సమానత్వం తీసుకురావడానికి అంకితం చేశారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కాన్పూర్ లోని కార్వాల్ నగరంలో సంఘ ప్రాంత కార్యాలయాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించారు. అలాగే కేశవ భవన్ లో కొత్తగా నిర్మించిన అంబేద్కర్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశాన్ని బలమైన, స్వావలంన కలిగిన, సాంస్కృతిక సుసంపన్న దేశంగా మార్చడమే లక్ష్యమని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే సూత్రాలను ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోలేదని, భారత మట్టిలోంచి, బుద్ధుని ఆలోచనల నుంచి తీసుకున్నానని తరుచూ అనేవారని గుర్తు చేశారు.
స్వాతంత్రం కోసం బయల్దేరితే సమాన్వతం పోతుందని, సమానత్వం తీసుకురావడానికి బయల్దేరితే స్వాతంత్రంతో పాటు సంకోచాలు కూడా వస్తాయన్నది ప్రపంచలో వున్న అనుభవమని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం రావాలంటే సోదరభావం చాలా ప్రధానమని అన్నారు. సోదరత్వమే మతమని, భారత దేశం ధర్మమే ప్రాణంగా వున్న దేశమని, అంబేద్కర్ ఇదే అంశానికి గట్టి మద్దతుదారుగా నిలబడ్డారని మోహన్ భాగవత్ అన్నారు. సమాజంలో వున్న అసమానతలను కూకటి వేళ్లతో పెకిలించడమే అంబేద్కర్ ప్రధాన కర్తవ్యంగా వుండేదన్నారు.దీని కోసమే జీవితాంతం పనిచేశారన్నారు.
ఆరెస్సెస్ పనిని కూడా డాక్టర్జీ ప్రారంభించారని అన్నారు. అయితే సామాజిక అసమానతలకు బాధితులుగా లేరని కానీ… పేదరికం విషయంలో మాత్రం ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. బాల్యం నుంచే తన విద్యాభ్యాసాన్ని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనే పూర్తి చేశారన్నారు. సమాజంలో వున్న అసమానతలను తొలగించి, సమాజంల సౌభ్రాతృత్వాన్ని నింపడానికి జీవితాన్ని అంకితం చేశారన్నారు. తన జీవితం కోసం ఆయన ఏమీ చేసుకోలేదని, జీవితాంతం హిందూ సమాజం సంఘటన, సమానత్వం కోసం డాక్టర్జీ పనిచేశారని మోహన్ భాగవత్ అన్నారు.జాతి నిర్మాణం అనే అంశంతో సంఘ కార్యం ముడిపడి వుందని, ఈ నూతన కార్యాలయం కేంద్రంగా ఈ పని మరింత సమర్థవంతంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *