అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగస్వాములమవుదాం: విశ్వహిందూ పరిషత్‌ ‌పిలుపు

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నిర్మాణ మవుతున్న మందిరాన్ని కేవలం ఒక మందిరంగా విశ్వహిందూ పరిషత్‌ ‌భావించడం లేదు. ఇది జాతి స్వాభిమాన మందిరంగా నిలుస్తుంది. ఈ నిర్మాణం ద్వారా భారతీయ ఆత్మను సమాజంలో తిరిగి ప్రతిష్టితమవుతుంది. ఈ ప్రేరణ సమాజం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలను రూపుమాపు తుంది. సమాజంలో సామాజిక సమరసతను నెలకొల్పడం, పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, వృత్తి నైపుణ్యం ప్రతి ఒక్కరికి అందించడం, మహిళల సాధికారత సాధించడం, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న తీవ్రవాద భావజాలాన్ని రూపు మాపడం, వేదాలు ప్రభోదంచిన ‘‘సర్వే భవంతు సుఖినః’’’ అన్న పవిత్ర ఆశయాన్ని సాధించడానికి అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఎలాంటి బాధలు లేని సమాజాన్ని తీర్చిదిద్దడానికి రామాలయం ప్రేరణగా నిలుస్తుంది. ఇలాంటి లక్ష్యాలను అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర ప్రేరణగా సాధిస్తామనే విశ్వాసాన్ని విశ్వహిందూ పరిషత్‌ ‌ప్రకటిస్తోంది.

అటువంటి రామమందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్‌ ‌పూర్తి స్థాయి నిధి సమర్పణ అభియాన్‌ ‌చేపట్టింది. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జనవరి 14(మకర సంక్రాంతి) ప్రారంభమై ఫిబ్రవరి 27 వరకు జరుగుతుంది. అయితే తెలంగాణాలో మాత్రం జనవరి 20 నుంచి ఫిబ్రవరి 10వరకు నిధిసేకరణ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 4 లక్షలకు పైగా గ్రామాలలో 11 కోట్లకు పైగా కుటుంబాలను ఇంటింటికి వెళ్లి విశ్వహిందూ పరిషత్‌ ‌కార్యకర్తలు కలిసి అయోధ్యలో నిర్మాణం జరుగుతున్న శ్రీరామ మందిర నిర్మాణం కోసం భక్తుల నుండి నిధిని సేకరిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9000కు పైగా గ్రామాల్లో సుమారు 40 లక్షల కుటుంబాలను, 3 కోట్ల పైచిలుకు వ్యక్తులను కలిసి మందిర నిర్మాణం కోసం నిధిని సమీకరించాలని విశ్వహిందూ పరిషత్‌ ‌సంకల్పించింది.

శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సేకరణ రూ.10, రూ.100, రూ.1000 కూపన్ల ద్వారా జరుగుతుంది. రూ.2000 ఆపైన ఇచ్చే నిధికి రసీదు ఇస్తారు. దాతలు తాము సమర్పించిన మొత్తానికి సెక్షన్‌ 80(‌జి) ద్వారా ఆదాయపుపన్ను నుండి మినహాయింపు పొందవచ్చు. 5గురు కార్యకర్తలతో ఒక జట్టు చొప్పున నిధి సేకరణలో అనేక బృందాలు ఈ పనిలో పాల్గొంటాయి. క్రింది స్థాయిలో నిధి ప్రముఖ్‌ ‌ప్రత్యేకంగా నియమించి సేకరించిన నిధిని 48 గంటలలోపు తీర్ధ క్షేత్ర ట్రస్టు అకౌంట్‌లో డిపాజిట్‌ ‌చేయడం జరుగుతుంది. ఈ నిధి సేకరణ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. లార్సన్‌ అం‌డ్‌ ‌టర్బో సంస్ధ ద్వారా మందిర నిర్మాణం జరుగుతుంది. టాటా కన్సల్టెన్సీ, ఐఐటీ ముంబై, ఐఐటీ ఢిల్లీ ఐఐటీ చెన్నై ఐఐటీ గౌహతి, సీఈబీఆర్‌ఐ ‌రూర్కెలా సంస్థల నుండి మందిర నిర్మాణానికి సాంకేతిక, ఇంజనీరింగ్‌ ‌సహకారం లభిస్తుంది. దేవాలయాన్ని పూర్తిగా రాతి కట్టడాలతో నిర్వహించడం జరుగుతుంది.

శ్రీ రామ జన్మభూమిలో 2.7 ఎకరాల స్థలంలో 57,406 చ.అడుగుల వైశాల్యంతో ప్రధాన మందిరం నిర్మాణం జరుగుతుంది. ప్రదాన మందిరం 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో నిర్మాణం జరుగుతుంది. 3 అంతస్తులు, 5 గోపురాలు ఉంటాయి. మొదటి అంతస్తులో 160 స్తంభాలు, రెండవ అంతస్తులో 182 స్తంభాలు, మూడవ అంతస్తులో 74 స్తంభాలు ఉంటాయి. 2024వ సంవత్సరంలోపు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు భగవాన్‌ ‌శ్రీరాముని దర్శనానికి ఆహ్వానించడానికి పూర్తి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన దేవాలయంతో పాటు 67. 33 ఎకరాల స్ధలంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో పుస్తక ప్రదర్శనశాల, ప్రాచీన వస్తువుల ప్రదర్శన, మ్యూజియం, పరిశోధన కేంద్రం, యజ్ఞశాల, వేద పాఠశాల, సత్సంగ భవనము, ప్రసాద వితరణ కేంద్రం, డిజిటల్‌ ‌యాంపి థియేటర్‌, ‌ధర్మశాల, ఇతర సదుపాయాలు ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *