అగ్ని ప్రైమ్‌ మిసైల్‌ సిద్ధం

మిస్సైల్‌ రంగంలో భారత్‌ మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే వివిధ లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్‌ మిస్సైల్‌ అగ్నికి సంబంధించి ఐదు రకాల మిస్సైల్‌లు విజయవంతంగా పరీక్షించిన భారత్‌ ఇప్పుడు తాజాగా అగ్ని (ప్రైమ్‌)ను రూపొందించింది. ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి అగ్ని ప్రైమ్‌ మిసైల్‌ను విజయ వంతంగా పరీక్షించినట్లు భారత ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

అగ్ని తరగతి క్షిపణుల్లో ఇది నవతరం క్షిపణి అని తెలిపారు. ఇది 1,000 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని పేర్కొన్నారు. ఈ క్షిపణి బరువు అగ్ని-3 క్షిపణి బరువులో సగం మాత్రమేనని తెలిపారు. అగ్ని-పీ మిస్సైల్‌ కొత్త జనరేషన్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ వేరియంట్‌. అగ్ని ప్రైమ్‌కు అణ్వాయుధాలు మోసుకువెళ్లే సామర్థ్యం ఉన్నది. అగ్ని క్లాస్‌కు చెందిన ఈ మిస్సైల్‌లో అనేక కొత్త ఫీచర్లను జోడిరచారు. అత్యంత కచ్చితత్వంతో మిషన్‌ లక్ష్యాలను చేరుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. అనుకున్నట్లే క్షిపణి ట్రాజెక్టరీ సాగిందని డీఆర్డీవో చెప్పింది. అత్యున్నత సామర్ధ్యంతో అన్ని లక్ష్యాలను అందుకున్నట్లు డీఆర్డీవో వెల్లడిరచింది. అగ్ని ప్రైమ్‌ క్షిపణి.. రెండు దశల సాలిడ్‌ ప్రొపెల్లెంట్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌. డ్యుయల్‌ నావిగేషన్‌, గైడెన్స్‌ వ్యవస్థలు కూడా ఉన్నాయి. మిస్సైల్‌లో ఉన్న అన్ని అధునాతన సాంకేతిక వ్యవస్థలు సరైన రీతిలో స్పందించినట్లు డీఆర్డీవో తెలిపింది.

ఈ అగ్ని ప్రైమ్‌ తరువాత 11వేల నుండి 12వేల కిలోమీటర్ల దూరపు లక్ష్యాలను ఛేదించే అగ్ని (పI) తరహా మిస్సైళ్లను కూడా రూపొం దించేందుకు ణRణూ శాస్త్రవేత్తలు సన్నద్ధ మవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *