సరిహద్దుల్లో కాల్పులు.. తెలుగు జవాన్ వీర మరణం

భారత్, పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీర మరణం పొందారు. జమ్మూ కశ్మీర్ లో ఏపకి చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు. పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతిచెందారు. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండా. 2002 లో భారత ఆర్మీలో చేరారు. నాసిక్ లో ట్రైనింగ్ పొంది, జమ్మూ కశ్మీర్ లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్ కి బదిలీ అయ్యారు. పంజాబ్ లో పనిచేస్తుండగా… భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పంజాబ్ నుంచి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లారు. విధులు నిర్వర్తిస్తుండగా… పాక్ కాల్పుల్లో వీర మరణం పొందారు.కాల్పుల్లో మురళీ నాయక్ మృతి చెందినట్లు తండాలో వుంటున్న తల్లిదండ్రులకు సమాచారం అందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *