1.5 కోట్ల మంది అయోధ్య రాముడ్ని దర్శించుకున్నారు : ట్రస్ట్ ప్రకటన

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అయోధ్య రామ మందిరానికి భక్తుల తాకిడి బాగా పెరిగిపోయింది. జనవరి 22న బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి అయోధ్య రామ మందిరాన్ని ఇప్పటి వరకు సుమారు 1.5 కోట్ల మంది భక్తులు ఆ రాముడ్ని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ప్రకటించారు. రామ్‌లల్లా దర్శనం కోసం ప్రతి రోజూ సుమారు లక్ష మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఆలయ ప్రాకారం చుట్టూ 14 అడుగుల వెడల్పుతో ‘‘పర్కోట’’ పేరుతో భద్రతా గోడను నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. ఇది ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పుతో భద్రతా గోడ నిర్మిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *