న్యూయార్క్లో జరిగే ఇండియా డే పరేడ్ లో అయోధ్య రామ మందిర శకటం
న్యూయార్క్లో వచ్చే నెలలో జరిగే ఇండియా డే పరేడ్ సందర్భంగా అయోధ్య రామ మందిర శకటాన్ని ప్రదర్శించనచనున్నారు. ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో ఇదే హైలేట్ అవుతుందని తెలిపారు. ఈ శకటం 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తుతో వుంటుంది. వచ్చే నెల 18 న ఈ కార్యక్రమం జరుగుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ నటుడు పంకజ్ త్రిపాఠి గౌరవ అతిథిగా హాజరవుతారని, వేలది మంది ప్రవాస భారతీయులు కూడా పాల్గొంటారని అసోసియేషన్స్ ప్రకటించింది. ఈ పరేడ్లో భారత దేశం గొప్పతనం, సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, విజయాలు ఈ కార్యక్రమంలో వుంటాయని పేర్కొన్నారు.
నగరంలోని మాడిసన్ అవెన్యూ త్రివర్ణ పతకం రంగులో కనిపిస్తుందని, అలాగే భారత దేశభక్తిని పెంపొందించే పాటలు వుంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్ మద్దతిస్తుందని జనరల్ వినయ్ ప్రధాన్ ప్రకటించారు. ‘‘వసుధైవ కుటుంబం’’ అన్న థీమ్తో ఈ కార్యక్రమం వుంటుందని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ, సిద్దివినాయక దేవాలయం ప్రతినిధులు కలిసి కాన్సులేట్లో జరిగిన కార్యక్రమంలో రామ మందిరం పటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ సంస్కృతిని అందరికీ పరిచయం చేస్తామని, న్యూయార్క్ ప్రాంత వాసులకు కూడా పరిచయం చేస్తామని చైర్మన్ అంకుర్ వైద్య తెలిపారు.