అస్సాంలో వెదురు కాంతులు

ఈ ప్రపంచంలో ప్రకృతి మనకు ఎన్నో నేర్పిస్తుంది. ఎన్నో కళలకు ప్రకృతి జీవం పోస్తుంది. ముఖ్యంగా అడవులలో దొరికే వనరులతో అనేక వస్తువులు రూపుదాల్చుకుంటాయి. నైపుణ్యం కలిగిన హస్తకళాకారుడిగా మారాలని అడవులు కూడా మనకు పిలుపునిస్తాయి. ఈ పర్వతాలు, అడవులు మనలోని శిల్పిని మేల్కొల్పండంటూ తట్టిలేపుతాయి. ఈ వికసించే ప్రకృతి, సంపూర్ణము, స్వయం ప్రకాశము. బహుశా అందుకే మనకు స్వయంశక్తిగా ఎలా మారాలో అడుగడుగునా చెబుతాయి. అస్సాంలోని అద్భుతమైన వెదురు క్రాఫ్ట్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.

వనవాసీల జీవనాధారానికి ఈ కళనే ఆధారంగా చేసిన సేవాభారతి పాంచజన్య కుటీర్‌ ఉద్యోగ్‌ 2022 నాటికి రూ.50 లక్షల టర్నోవర్‌ సాధించి 60కి పైగా గ్రామాలు లబ్ధిపొందాయి. వెదురుతో కళాత్మక వస్తువులను తయారు చేసి సేవలందిస్తున్నారు. స్థానిక మార్కెట్‌, సౌరాష్ట్ర ఫెయిర్‌, అప్నా ట్రేడ్‌ ఫెయిర్‌, బిహు ఫెయిర్‌, అస్సాం ఫెయిర్‌ వంటి ప్రదర్శనల ప్రయోజనాన్ని పొందడం ద్వారా, వారు జీవితంలో పురోగతి వైపు సాగుతున్నారు.

ఇక్కడ ప్రతి ఇంట్లో సంస్కృతి, సంప్రదాయా లలో వెదురు క్రాఫ్ట్‌ అంతర్భాగం. వెదురుతో చేసిన వస్తువులను ఎగ్జిబిషన్‌లో కొత్త రూపంలో ప్రదర్శిస్తే వాటిని చూసి స్థానిక ప్రజలు మంత్రముగ్దులయ్యారు. 2009 నుంచి సేవాభారతితో అనుబంధం ఉన్న జిల్లా కన్వీనర్‌ అవినాష్‌ హజారికా వెదురు వస్తువుల తయారీలో శిక్షణ తీసుకుని స్వయం సమృద్ధి సాధించి 2022 నాటికి వేలాది మందికి వివిధ వెదురు వస్తువుల తయారీలో శిక్షణ ఇచ్చారు. ఈ పని ప్రారంభమైనప్పుడు, 7-8 ఉత్పత్తులు మాత్రమే తయారు చేశారు. కానీ నేడు అస్సాంలో జరిగే పెద్ద ప్రదర్శనలలో 20 రకాలకు పైగా ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేశారు. కొత్త కళాకారులు, సృజనాత్మక శక్తితో అనేక వెదురు ఉత్పత్తులను తయారు చేయటానికి తోడ్పడుతూ వచ్చింది.

అస్సాంలోని జోర్హాట్‌లోని పాంచజన్య కుటీర పరిశ్రమ కింద సేవా భారతి గ్రామ గ్రామాన వెదురు క్రాఫ్ట్‌ శిక్షణా శిబిరాలను నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులు, సహచరులుగా ఈ మొత్తం పనిలో అవినాష్‌ జీతో పాటు, నాగెన్‌ కలిత, రోమైన్‌ హజారికా కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. పక్కా రోడ్లు, కరెంటు కూడా లేని కొండ ప్రాంతాలకు వెళ్లి పూర్తి నమ్మకంతో వెదురు క్రాఫ్ట్‌లో ప్రజలకు పూర్తి శిక్షణ ఇవ్వడం, క్యాంపులు ఏర్పాటు చేయడం వారికి చాలా పెద్ద పని.

మనిషి జీవితంలో నిత్య అన్వేషకుడిగా ఉండటం చాలా ముఖ్యం. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎదోక మార్గం కనిపిస్తుంది. మజులి గ్రామానికి చెందిన దివ్యజ్యోతి నాథ్‌, జోర్హాట్‌కు చెందిన ప్రణబ్జ్యోతి చాంగ్‌మాయి వారు పేదరికంతో పోరాడుతున్నారు. గ్రాడ్యుయేషన్‌ తర్వాత కూడా ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. వృద్ధులైన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేకపోతున్నానన్న బాధ అతడిని లోలోపల వేధించింది. సేవా భారతి శిక్షణ శిబిరం అతనికి ఒక వరంగా మారింది. అతనిలోని సృజనాత్మక శక్తులు అతనికి కొత్త అవకాశాన్ని అందించాయి, అతని ఊహకు రెక్కలు వచ్చినట్లు అనిపించింది. రూ.100 కు కూడా పనిలేని చోట రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నెలవారీ సంపాదనను పొందగలుగుతున్నాడు.

భారతీయ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర చాలా ఎక్కువ. అస్సాంలోని ప్రతి ఇంట్లో మహిళలు వెదురుతో వస్తువులను తయారు చేస్తారు. గత కొన్నేళ్లుగా, సేవాభారతి మజులి, గోలాఘాట్‌ జిల్లా వంటి వివిధ గ్రామాలను సందర్శించి వెదురు శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. ఇందులో పురుషులతో పాటు వందలాది మంది మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారిలో ఒకరైన దీప్శిఖా బర్సుతియా తన నైపుణ్యం కలిగిన పనితనంతో నెలకు రూ. 10,000 సంపాదిస్తోంది. ఆమె చేతితో తయారు చేసిన వస్తువులను ప్రజలు చాలా ఇష్టపడతారు. ఈ శిక్షణా శిబిరం వారిని స్వావలంబనగా మార్చడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఒక ఆదర్శవంతమైన కార్యాచరణ వేలాది మందికి మార్గం చూపుతుంది. 2019 నుండి, సేవా భారతి చెరుకు, బాంబూ క్రాఫ్ట్‌ మేఘాలయలో కూడా ఇదే తరహాలో పని చేస్తోంది. వెదురు కళాత్మక అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు నోని పాడ గ్రామంలో కేంద్రం నడుపగా, అందులో 250 మందికి పైగా శిక్షణ పొందగా, 15 గ్రామాలకు చెందిన 200కు పైగా కుటుంబాలు లబ్ధి పొందు తున్నాయి. గారో హిల్స్‌లో సేవా భారతి విభాగ్‌ సంఘటనా మంత్రి జనార్దన్‌ కోచ్‌ మాట్లాడుతూ, వెదురు క్రాఫ్ట్‌ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రపంచం మొత్తానికి ఎలా వ్యాప్తి చెయ్యాలని, వెదురుతో చేసిన కళాత్మక వస్తువులకు, ఈ నైపుణ్యం కలిగిన కళాకారులకు గౌరవం, ప్రత్యేక గుర్తింపు ఎలా ఇవ్వాలనే దిశలోనే గ్రామ వాసులకు సూచనలు ఇస్తున్నాము. దీన్ని ప్రచారం చేసేందుకు, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు సేవాభారతి ద్వారా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *