సన్యాసి రూపంలో భారత్ ల అక్రమ నివాసం… బంగ్లాదేశ్ వ్యక్తి అరెస్ట్

బంగ్లాదేశ్ వ్యక్తి బౌద్ధ సన్యాసిగా భారత్‌లో జీవిస్తున్నాడు. పలు పేర్లతో పలు దేశాల పాస్‌పార్ట్‌లు అతడి వద్ద ఉన్నాయి. థాయ్‌లాండ్‌ వెళ్లేందుకు పాట్నా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఆ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అనుమానించి అరెస్ట్‌ చేశారు. అతడ్ని ప్రశ్నించగా ఎనిమిదేళ్లుగా అక్రమంగా భారత్‌లో ఉంటున్నట్లు బయటపడింది.

బంగ్లాదేశ్‌ పౌరుడైన బాబు జో బారువా అలియాస్ రాజీవ్ దత్తా, బీహార్‌లోని గయాలో ఎనిమిదేళ్లుగా ఉంటున్నాడు. బౌద్ధ సన్యాసిగా నటిస్తూ గయాలోని ఆశ్రమంలో నివసిస్తున్నాడు. శుక్రవారం థాయ్‌లాండ్‌ వెళ్లేందుకు గయా విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఆ వ్యక్తిని అనుమానించిన భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

అతడ్ని ప్రశ్నించగా బంగ్లాదేశ్ జాతీయుడిగా తేలింది. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేదా వీసా లేకుండా ఆ వ్యక్తి ఎనిమిదేళ్లుగా గయాలో బౌద్ధ సన్యాసిగా నివసిస్తున్నట్లు భద్రతా అధికారులు తెలుసుకున్నారు. గతంలో లుకౌట్‌ నోటీస్‌ కూడా ఉన్న అతడి వద్ద పలు పేర్లతో ఉన్న నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్‌, పాన్‌ వంటి పలు నకిలీ ప్రతాలు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు, చర్యల కోసం గయా పోలీసులకు అతడ్ని అప్పగించారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *