సికింద్రాబాద్ మీదుగా భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు
హరిద్వార్, రిషికేష్, వైష్ణోదేవి, అమృత్సర్, ఆనంద్పూర్ తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకునే యాత్రికుల కోసం ఈ నెల 23 నుంచి మే 2 వరకు విజయవాడ నుంచి భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నట్లు ఐఆర్సీటీసీ అధికారులు ప్రకటించారు. తొమ్మిది రాత్రుళ్లు, పది పగళ్లు సాగే ఈ యాత్రలో మానసాదేవి ఆలయం, రామ్ జులా, లక్ష్మణ జులా, అనంద్ సాహిబ్ గురుద్వార్, నైనా దేవి ఆలయం, గోల్డెన్ టెంపుల్, మాత వైష్ణోదేవి దేవాలయ సందర్శనం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్నగర్ స్టేషన్లలో బోర్డింగ్/డిబోర్డింగ్ సదుపాయం కల్పించారు.
ఈ యాత్రలో ఎకానమి (స్లీపర్ క్లాస్) ఒక్కొక్కరికి రూ. 18,510, స్టాండర్డ్ (3 ఏసీ) ఒక్కొక్కరికి రూ. 30,730, కంఫర్ట్ (2 ఏసీ) ఒక్కొక్కరికి రూ 40, 685 టిక్కెట్ ధర నిర్ణయించారు. ఈ యాత్రలో ఆన్బోర్డు/ఆఫ్బోర్డులో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి టిఫిన్, భోజనం, పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు హోటళ్లలో బస తదితర ఏర్పాట్లతో పాటు కోచ్లలో సీసీ కెమెరాలతో నిరంతరం భద్రత ఏర్పాట్లు, టూర్ ఎస్కార్ట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆర్ఆర్సీటీసీ వెబ్సైట్ లేదా 97013 60701 ఫోన్ నంబర్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు.