రైతు సంక్షేమమే ధ్యేయంగా భారతీయ కిసాన్ సంఘ్ పోరాటం
రైతు సమస్యల పరిష్కారం కోసం, రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు భారతీయ కిసాన్ సంఫ్ు (బీకేఎస్) ఆధ్వర్యంలో 2022 డిసెంబర్ 19న సెంట్రల్ ఢల్లీ రాంలీలా మైదాన్లో దేశవ్యాప్తంగా దాదాపు 50,000 మంది రైతులు సమావేశమయ్యారు. సుమారు 700 నుండి 800 బస్సులు, 3,500 నుండి 4,000 ప్రైవేట్ వాహనాల్లో రైతులు మైదానానికి చేరుకున్నారు. నగర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఢల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. రైతులు కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ర్యాలీ నిర్వహించారు. గతంలో మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నెలల తరబడి జరిగిన ర్యాలీ చాలా హింసాత్మకంగా ఎందుకు మారిందని ర్యాలీలో పాల్గొన్న రైతులను మీడియా సంస్థలు ప్రశ్నించగా వారు స్పందిస్తూ ‘‘తమ ఉద్యమానికి ఏ రాజకీయ పార్టీ నిధులు సమకూర్చడం లేదని, ర్యాలీ శాంతియుతంగా జరగడానికి కారణం అదే కావచ్చు’’ అని పేర్కొన్నారు. ఢల్లీలో హంగామా చేసిన నకిలీ రైతులు రాజకీయ అండదండలతో ర్యాలీని పక్కదారి పట్టించి, దేశ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లక్ష్యంతో నిరసనల పేరుతో రైతులను కించపరిచారన్నారు. గతంలో జరిగిన ‘కిసాన్ ఆందోళన్’లో తాము భాగం కాదని, అయితే కొందరు తాము ఆ ఉద్యమం ప్రారంభంలో పాల్గొని, నిరసన పక్క దారి పట్టడంతో వెనక్కి తగ్గారని తెలిపారు. రాకేష్ టికాయత్ లాంటి రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు రైతులను మోసం చేస్తున్నారని ర్యాలీలో ఓ రైతు అన్నారు. రాకేష్ టికాయత్ లాంటి వారు తమ నాయకుడు కాదని రైతులు తేల్చిచెప్పారు. రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచేందుకే ఈ ర్యాలీ చేస్తున్నామని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదని స్పష్టం చేశారు.
‘‘కిసాన్ గర్జన ర్యాలీ’’లో పాల్గొన్న రైతులు మూడు కీలకమైన డిమాండ్లు చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KSNY) కింద పంపిణీ చేస్తున్న రూ.6 వేలను సంవత్సరానికి రూ. 20వేలకు పెంచాలని, అలాగే రైతు పరికరాలపై విధించిన జీఎస్టీని తగ్గించాలని కోరారు. పంట ధరను దాని ధరకు అనుగుణంగా నిర్ణయించాలని, బంగాళాదుంపలు భూమిలోపల పెరుగుతాయో లేదా భూమిపై పెరుగుతాయో కూడా తెలియని నాయకులు నిర్ణయించడం వల్ల రైతులు నష్టపోతున్నా రన్నారు. తాము జాతీయవాదులమని, మూడు వ్యవసాయ చట్టాలతో తమకు ఎప్పుడూ సమస్య లేదని కొన్ని లోపాలను సరిచేసిన తర్వాత ఆ చట్టాలను అంగీకరిస్తామని పేర్కొన్నారు.
‘కిసాన్ గర్జన ర్యాలీ’కి సాంస్కృతిక వైభవం తోడయింది. కొందరు రైతులు సంప్రదాయ నృత్యం చేస్తూ కనిపించగా, మరి కొందరు రaల్ లేదా కర్తాల్ వంటి వాయిద్యాలను వాయిస్తూ కనిపించారు. రైతులు శాంతి యుతంగా కూర్చున్న వేదికపై భారత్ మాత, శ్రీరాముడి చిత్రపటాలను అలంకరించారు. ‘‘కిసాన్ గర్జన ర్యాలీ’’కి చాలా మంది మహిళలు హాజరు కావడం విశేషం.