అయోధ్యలో మూడు రోజుల పాటు వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు
అయోధ్య రామ మందిరంలో వీఐపీ, వీవీఐపీ దర్శనంపై నిషేధం విధించారు. జనవరి 11 నుంచి 13 వరకు వీఐపీ దర్శనాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆపేస్తున్నట్లు ట్రస్టు పేర్కొంది. అలాగే వీఐపీ, వీవీఐపీ పాసులు కూడా జారీ చేయమని పేర్కొంది. ఉదయం, సాయంత్రం, రాత్రి స్లాట్లు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. రామ మందిర మొదటి వార్షికోత్సవం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి వార్షికోత్సవం ఈ నెల 11 న జరగనుంది. మూడు రోజుల పాటు ఈ వార్షికోత్సవాలు జరుగతాయి. తొలి వార్షికోత్సవానికి ప్రతిష్ఠా ద్వాదశిగా నిర్వహిస్తున్నట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పేర్కొన్నారు.