కుంభమేళాలో ఉచితంగా BSNL సిమ్ కార్డులు

ప్రయాగ్ రాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళాలో ఎవరికి తోచిన సేవలు వారు చేస్తూనే వున్నారు. ప్రభుత్వం, ఆరెస్సెస్ కార్యకర్తలు, జాతీయవాదులు, ఇతరులు తమకు తోచిన విధంగా సేవలు చేస్తూనే వున్నారు. ఇందులో భాగంగా కుంభమేళా ప్రాంతంలో నిరంతరం కమ్యూనికేషన్ సేవల సౌలభ్యం కోసం బీఎస్ఎన్ఎల్ చొరవ తీసుకుంది. ఇందుకు గాను ఉచితంగా BSNL సిమ్ కార్డులను పంచిపెడుతోంది. కమ్యూనికేషన్ సువ్యవస్థితంగా నడవడానికి ఈ పద్ధతి అవలంబిస్తోంది. ఈ మేరకు సంచార్ నిగమ్ లిమిటెడ్ ఓ కస్టమర్ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఆన్ సైట్ సహాయం, ఫిర్యాదు పరిష్కారం, ఎలాంటి అంతరాయం లేని కమ్యూనికేషన్ సేవలను అందిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు ఉచితంగా సిమ్ కార్డులను అందిస్తోంది.

కుంభమేళా ప్రాంతంలో ఉచితంగా సిమ్ కార్డులు అందజేస్తున్నాం. వారి వారి కుటుంబీకులతో నిత్యం కమ్యూనికేషన్ వుండేందుకు ఈ ప్రయత్నం. BSNL లాల్ రోడ్ సెక్టార్-2లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. అక్కడి నుంచే ఈ సేవలు అందిస్తున్నాం’’ అని బీఎస్ఎన్ఎల్ అధికారులు ప్రకటించారు. దీంతో ఫైబర్ కనెక్షన్లకు, మొబైల్ రీచార్జీ వంటి సేవలకు గణనీయంగా డిమాండ్లు పెరిగాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *