కేంద్ర ప్రభుత్వోద్యోగులు ఆర్ఎస్ఎస్‌లో పాల్గొనవచ్చు..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించింది.ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా గత 40 ఏళ్లలో జారీ చేసిన మూడు వేర్వేరు ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేర్వేరు సమయాల్లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకలాపాల్లో కేంద్ర ఉద్యోగుల పాల్గొనకుండా నిషేధించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *