నలుగురికి ‘‘ఖేల్ రత్న’’ అవార్డులు

భార‌త అత్యున్న‌త క్రీడా పుర‌స్కారం మేజ‌ర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ర‌త్న అవార్డుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్‌షిప్ విజేత గుకేష్‌కు, షూటింగ్‌లో ఒలింపిక్స్ ప‌త‌క విజేత మ‌నుబాక‌ర్‌కు, హాకీ క్రీడాకారుడు హ‌ర్మ‌న్‌ప్రీత్‌సింగ్‌కు, పారా ఒలింపిక్స్ స్వర్ణ ప‌త‌కం విజేత‌ ప్ర‌వీణ్ కుమార్‌కు ఖేల్‌ర‌త్న అవార్డులు వ‌రించింది. జనవరి 17వ తేదిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది.మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా మను బాకర్ నిలిచింది. పర్సనల్ ఈవెంట్‌తో పాటు మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆమె కాంస్య పతకాలు కొల్లగొట్టింది.

ఇక… కొన్ని రోజుల క్రితమే వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచి, అందరి దృష్టీ ఆకర్షించిన గుకేశ్ కూ ఖేల్ రత్న వరించింది. మరోవైపు హాకీలో హర్ మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్స్ లో ప్రవీణ్ కుమార్ కి ఖేల్ రత్న అవార్డులు లభించాయి.

ఇక, 17 మంది పారా అథ్లెట్లు స‌హా 32 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించింది కేంద్రం. ఇందులో జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), అన్ను రాణి (అథ్లెటిక్స్), నీతు (బాక్సింగ్), స్వీటీ బురా (బాక్సింగ్), వంతిక అగర్వాల్ (చెస్) తదితరులు ఉన్నారు. ఈ నెల 17న ఖేల్‌ర‌త్న అవార్డుల‌ను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌దానం చేయ‌నున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *