లోక కల్యాణం కోసం కార్మికుడి సైకిల్ యాత్ర… మంగళ్ రాజ్ ని ఆదరిస్తున్న ప్రజలు
దేశ ప్రజలను ఏకం చేయాలన్న సంకల్పంతో ఛత్తీస్ గఢ్ కి చెందిన మంగళరాజ్ మధురై మీనాక్షి ఆలయానికి బయల్దేరారు. సైకిల్ నడుపుకుంటూ ఈ యాత్రను చేపట్టారు. మంగళ్ రాజ్ ఓ కార్మికుడిగా పనిచేస్తున్నారు. తెల్లటి చొక్కా, పచ్చని రంగు టవల్ తో ఈ యాత్ర చేస్తున్నారు. ఇలా వివిధ సంకల్పాలతో యాత్రలు చేయడం ఇది మూడోసారి. గత యేడాది కన్యాకుమారి, రామేశ్వరానికి కూడా ఇలాగే వెళ్లారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రజలందరూ సంఘటితంగా వుండాలని, ఏకతాటిపైకి రావాలని మధురై దేవాలయానికి బయల్దేరారు. అతని నిబద్ధత చూసి… దారి పొడవునా ప్రజలు అద్భుతంగా స్వాగతం పలుకుతున్నారు.
భారత్ లోని ప్రజల మధ్య ఐక్యతా సందేశం మరింత వ్యాప్తి అయ్యేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ మంచి మార్పు రావాలన్నదే తన ఆశ అని వివరించారు. ఈ పర్యటనకు ముందు, సహేవా రెండుసార్లు షిర్డీ, ఉజ్జయిని, వైష్ణో దేవి, జమ్మూ మరియు కాశ్మీర్, కత్రా, అయోధ్య మరియు వారణాసికి ప్రయాణించారు. ఇలా యాత్రలు చేయడం మూడోసారి అని తెలిపారు. అయితే… నిత్యావసర వస్తువులను కూడా సైకిల్ పైనే తీసుకెళ్తానని, తన అవసరాల నిమిత్తం ఎవ్వరిపై ఆధారపడనని ప్రకటించారు. ఆయన సైకిల్ అచ్చు ఓ మొబైల్ వెరైటీ స్టోర్ లా కనిపిస్తుంది. అలాగే జాతీయ జెండాను కూడా తనతో పాటు వుంచుకుంటారు. జాతీయ జెండా దేశానికే గర్వ కారణమన్నారు.
దారిపొడవునా తన లక్ష్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారని తెలిపారు. అలాగే అల్పాహారం, చాయ్, భోజన వసతులు కూడా కల్పిస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. దేశమంతా ఐక్యంగా, శాంతియుతంగా జీవించాలని, అప్పుడే లోక కల్యాణం సాధ్యపడుతుందని మంగళ్ రాజ్ అభిప్రాయపడ్డారు.