విదేశీ కంపెనీల వికృతాలు
ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే అన్నారు పెద్దలు. మంచి ఆహారాన్ని తీసుకోవడం ఒక మంచి అలవాటు. ఒకప్పుడు మన దేశంలో సాంప్రదాయ వంటకాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉండేవి. వాటి వల్ల మన పెద్దవాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఎక్కువ కాలం జీవించేవారు. కానీ ఇప్పుడు పాశ్చత్య పోకడలతో కొత్త కొత్త ఆహారాలను తీసుకుంటూ కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. ముఖ్యంగా విదేశీ కంపెనీల నుంచి దిగుమతి అవుతున్న ఆహారపు వస్తువులు మన ఇండ్లలోకి చేరి మన ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు తినే ఆహార పదార్థాలలో కూడా రుచి కోసం, నిల్వ కోసం మోతాదుకు మించి రసాయనాలను కలపడం.. వాటిని పిల్లలు ఇష్టంగా తినడం వల్ల వారి ఎదుగుదల దెబ్బతినడం, చిన్నతనంలోనే వివిధ అనారోగ్య సమస్యలకు గురి కావడం మనం తరచూ చూస్తునే ఉన్నాం.
నెస్లే ఉత్పత్తులలో అధిక మోతాదులో చక్కెర
గ్లోబల్ ఫుడ్ అండ్ బెవరేజీ దిగ్గజం నెస్లే యూరప్లోని మార్కెట్లతో పోలిస్తే పేద దక్షిణాసియా (భారతదేశంతో సహా), ఆఫ్రికన్, లాటిన్ అమెరికా దేశాలలో ఎక్కువ చక్కెర కంటెంట్తో కూడిన పిల్లలు తినే ఉత్పత్తులను విక్రయి స్తుందని స్విస్ చీGూ, పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (IదీఖీAచీ) నివేదిక పేర్కొంది. వివిధ కౌంటీలలో విక్రయించే సుమారు 150 పిల్లల బేబీ ఉత్పత్తులను నివేదిక కోసం పరిశీలించారు. అందులో అంతర్జాతీయ ఆహార భద్రతా మార్గదర్శకాలకు మించి చక్కెర ఉన్నట్లు గుర్తించారు.
నివేదిక ప్రకారం, ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో విక్రయించే ఆరు నెలల శిశువులకు సంబంధించిన అన్ని గోధుమ ఆధారిత బేబీ ఫుడ్స్లో అత్యధిక చక్కెర ఉన్నట్టు గుర్తించారు. నెస్లె ఉత్పత్తుల్లో సగటున 3 గ్రాముల చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు. పబ్లిక్ ఐ ఈ దేశాల్లోని కంపెనీకి చెందిన 150 ఉత్పత్తులను బెల్జియంలోని ల్యాబ్లో పరీక్షించింది. పబ్లిక్ ఐ ఈ వాదన నిజమని తేలితే, అది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) సూచనలను ఉల్లం ఘించినట్లే అవుతుంది. డబ్లుహెచ్ఒ మార్గదర్శకాల ప్రకారం, 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆహారంలో చక్కెర లేదా తీపి పదార్థాలను ఉపయోగించకూడదు.
ఎందుకు హానికరం?
ఔనూ నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాల వయస్సులోపు పిల్లలకు యాడెడ్ షుగర్ ఉన్న ఆహార ఉత్పత్తులను పెట్టకూడదు. దీని వల్ల బరువు పెరగడం, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, జీవితంలో కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను వచ్చే ప్రమాదాన్ని పెరుగుతుంది. అదనంగా, శైశవదశలో అధిక చక్కెర వినియోగం దంత క్షయం, పేలవమైన పోషకాల తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదంతో ముడిపడి ఉంది.
కోకకోలా, పెస్పీలతో చావు కబురు ‘‘చల్లగా’’
జాగింగ్ చేసినపుడు, ఎక్కువ నడిచినపుడు, పనిచేసి అలసిపోయినప్పుడు మనలో చాలామందికి శీతల పానీయాలు తాగే అలవాటు ఉంటుంది. వాటిలోని రసాయనాల వల్ల తక్షణ ఉపశమనం ఉంటుంది. కానీ అవే రసాయనాల వల్ల శరీరంలోని అవయవాలు దెబ్బతిని అనేక రోగాల బారిన పడతున్నామని ఎక్కువ మంది గ్రహించలేకపోతు న్నారు. కోకాకోలా, పెప్సీ శీతల పానీయాలు చక్కెర లేదా కృత్రిమ రంగు కలిపిన సోడాలు తప్ప మరేమీ కాదు. డైట్ వెర్షన్ల పేరుతో ఈ పానీయాల ట్రెండ్ పెరిగింది.
కెఫిన్, చక్కెర ఉత్పత్తులు తియ్యటి శీతల పానీయాలలో స్థిరంగా ఉంటాయి. కోకాకోలా, పెప్సీ అనేక వ్యాధులకు కారణమయ్యే అస్పర్టేమ్ లను కలిగి ఉంటుంది. వీటిని ఉపయోగించకుండా కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో నిబంధనలు ఉన్నాయి. అస్పర్టేమ్తో కూడిన ఉత్పత్తులను తినకుండా పిల్లలను కచ్చితంగా జాగ్రత్తవహించాలి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీరు మీ జీవక్రియ రేటును వేగవంతం చేస్తుంది, కానీ డైట్ కోక్లోని రసాయనాల వల్ల అది రుచిగా అనిపిస్తుందికానీ ఇది నిజంగా జీవక్రియను తగ్గిస్తుంది. కొవ్వును కరిగించే ఎంజైమ్లను నాశనం చేస్తుంది. కాబట్టి కఠినమైన వ్యాయామం లేదా బిజీగా ఉన్న రోజు తర్వాత డైట్ కోక్ లేదా సాధారణ కోకాకోలా తీసుకోవడం మంచిది కాదు.
కోకాకోలా పెప్సీల జూన స్థాయి 3.2 చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జూన స్థాయి ద్రవం యొక్క ఆమ్ల స్వభావాన్ని నిర్ణయిస్తుంది. అందువల్ల ఈ పానీయాలు ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. ఎముకలు దంతాలను చాలా త్వరగా కరిగించ గలవు.
జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్లో క్యాన్సర్ కారకాలు
జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్లో కాన్సర్ కారకాలున్నాయని నిర్థారమైన విషయం మనందరికీ తెలిసిందే. పదేళ్ళ క్రితమే దీని గురించి వార్తలు వచ్చాయి. అప్పట్లో ఈ పౌడర్ వలన తనకు కాన్సర్ సోకిందని అమెరికాలోని ఇల్లినాయిస్కు చెందిన థెరిసా గ్రేసియా అనే మహిళ కోర్టులో కేసు కూడా వేశారు. ఇప్పుడు పదేళ్ళ తర్వాత కోర్టు దాని తీర్పును వెలువరించింది. అయితే ధెరిసా ఇప్పుడు బతికి లేరు. ఆమె 2020లోనే చనిపోయారు. కానీ కోర్టు తీర్పు మాత్రం ఇప్పుడు వచ్చింది. బాధిత కుటుంబానికి జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అది కూడా ఏకంగా భారత కరెన్సీ ప్రకారం రూ.375 కోట్ల పరిహారం ఇవ్వాలని చెప్పింది.
ఇక అమెరికా, కెనడాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ అమ్మకాలను నిలిపేశాయి. 2020 నుంచి ఇది అమల్లో ఉంది.