పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జ్ఞాన మందిర్
ఈ ప్రపంచంలో చాలా మందికి చదువు కోవాలని ఆశ, ఆసక్తి ఉంటాయి. కానీ కొద్ది మంది జీవితాల్లో చదువుకోవడం అనేది ఒక కలలాగానే మిగిలిపోతుంది. వారి కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితుల వల్ల చదువుపై ఆశని వదుకుంటున్న వారు కూడా ఎందరో ఉన్నారు. మంచి జ్ఞానం, చదువు పట్ల శ్రద్ధ ఉన్నప్పటికీ ఎంతో మంది చదువుకు దూరమవు తున్నారు. అలాంటి వారి కోసమే గుజరాత్లోని మణినగర్లో శ్రీ గురూజీ జ్ఞాన మందిరం తోడుగా నిలుస్తూ, నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
మనీషా అనే ఒక బాలిక తన తల్లితో కలిసి టీ స్టాల్లో టీ అమ్మే టప్పుడు, తాను ఎప్పటికైనా పదో తరగతి పాసు అవగలనా? అని తరచూ ఆలోచిస్తూ ఉండేది. ఆమె మొదటి నుండి గణితము, విజ్ఞాన శాస్త్రంలో అంతగా ప్రావీణ్యు రాలు కాదు. తన తండ్రి రిక్షా నడుపుతూ కుటుం బాన్ని పోషిస్తూ, మద్యపానానికి బానిసయ్యాడు. కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థి తులు సరిగా లేనందున చదువుకు దూరమవ్వాల్సి వచ్చింది. గుజరాత్లోని మణినగర్లోని కాంకరీయ రామానంద్ కోట్ మురికివాడలో నివసిస్తున్న ఈ అమ్మాయి, ఇప్పుడు మంచి మార్కులతో 12వ తరగతి పాసై, పెళ్లి అయి, ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తోంది. ఇక తన తండ్రి మద్యపానం మానేసి వారు నడిపిస్తున్న టీ స్టాల్ను చూసుకునే బాధ్యతను తీసుకున్నారు. పెళ్లిళ్లలో డోలు వాయిస్తూ ఇంటిని పోషిస్తున్న మన్సుఖ్ రావల్ కొడుకు చేతన్ రావల్ చదువుపై చాలా ఆసక్తిని కనబరిచేవాడు. కానీ తన తండ్రి, సంపాదనలో సగాన్ని మద్యానికి ఖర్చుచేసేవాడు. తనకి ట్యూషన్కి వెళ్ళడానికి కూడా డబ్బులు సరిపడేవి కాదు. అదే చేతన్ రావల్ ఈనాడు డాక్టర్ అయ్యి మణినగర్కు చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్గా పని చేస్తు న్నారు. చేతన్ తన గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోవ డానికి అసలు ఇష్టపడరు.
మిల్లత్ నగర్ బస్తీకి చెందిన సలీం, మూడు రోజులుగా కోచింగ్కు సెంటర్కు రాకపోవడంతో విషయం ఏమిటో తెలుసుకుందామని తన ఉపాధ్యాయుడే స్వయంగా ఇంటికి వెళ్లాడు. చిన్నారి సలీం కు టైఫాయిడ్ జ్వరం వచ్చినదని తెలుసుకున్న అయిన సలీంకు పూర్తి చికిత్సను అందించారు. సలీం ఈ రోజు మణినగర్లోని ఓ మిల్లులో పనిచేస్తూ కుటుంబం మొత్తం ఖర్చుల బాధ్యతను తానే చూసుకుంటున్నాడు. దేవుని తర్వాత, సంఘ స్వయంసేవక్, తన గురువు ‘‘కానూభాయ్’’ ముందు మాత్రమే సలీం తల వంచుతాడు.
ఇలా ఎన్నో విభిన్న కథలలో, పిల్లల జీవితాలలోని అదృష్టం కొద్దీ వచ్చిన మార్పునకు మూలం ‘‘శ్రీ గురూజీ జ్ఞాన మందిరం’’. మణినగర్ మున్సిపల్ పాఠశాలలో సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ఈ బోధనా కేంద్రం నడుస్తోంది. సాధారణ బోధనా కేంద్రం కాదు ఇది, నిరుపేద పిల్లల జీవితా లలో విద్య, సంస్కృతి, స్వావలంబన వెలుగును నింపే సూర్యకిరణాలు వంటిది.
సంఘ శాఖలో సేవా కార్యకర్తగా పని చేసిన కనుభాయ్ రాథోడ్, ప్రస్తుతం భాగ్ సేవా ప్రముఖ్. మధుభాయ్ బరోట్ కృషితో 14 సంవత్సరాల క్రితం ఈ బోధనా కేంద్రం ప్రారంభమైంది. ఈ అభ్యాస కేంద్రంలో, పిల్లలు చదువుకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయులు జీతం తీసుకోరు, ఈ కేంద్రంతో పరిచయం ఉన్న వారందరూ కేవలం సేవతో మాత్రమే ఈ కేంద్రానికి వస్తారు. కొన్నిసార్లు వారు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారు.
14 సంవత్సరాల క్రితం, కనూభాయ్ సేవా కార్యకర్తగా ఉన్నపటి నుండి బస్తీలలో నివసించే పిల్లలకు ఉచితంగా ‘మోడరన్ మేగజీన్’ అనే గణితం, సైన్స్ పుస్తకాన్ని పంపిణీ చేసేవారు. కానీ పిల్లలు ఆ పుస్తకం నుండి ఏమీ నేర్చుకోలేకపోయారు. ప్రభుత్వ పాఠశాలలో చదువు సక్రమంగా లేకపోవడంతో పదోతరగతి ఉత్తీర్ణత సాధించడం కష్టతరంగా మారింది. అందువల్ల, ఈ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో, శ్రీ గురూజీ జ్ఞాన మందిర్ పేరుతో ఈ బోధనా మందిరమును 2009లో ఒక స్వయంసేవక్ ఇంటిలోని ఒక చిన్న గదిలో ఏడుగురు పిల్లలతో ప్రారంభించారు. కాలక్రమేణా పిల్లలు, ఉపాధ్యాయులు, తరగతుల సంఖ్య కూడా పెరిగింది. ఆ తర్వాత ఆరాధనా పబ్లిక్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాల ఈ ట్యూషన్ సెంటర్ కోసం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు తరగతి గదులను ఉచితంగా ఇచ్చింది. ఇక్కడ పిల్లలకు చదువుతో పాటు విలువలని కూడా నేర్పిస్తారు.
గత కొన్నెళ్లుగా ఇక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత జయేష్ ఠక్కర్ గారు మాట్లాడుతూ ‘‘మేము పిల్లలను గురు పూర్ణిమ, రక్షా బంధన్, జన్మాష్టమి, నవరాత్రులు మొదలైన కార్యక్రమాలలో పాల్గొనేలా చూస్తాము. ఇక్కడ పిల్లలతో అన్నిపండగలు జరుపుకుంటాము. సమయానుసారంగా ధార్మిక నిబంధనలు, చర్చలు, దేశభక్తి గీతాలు, కథలు చెప్పడం వంటి పోటీలు కూడా నిర్వహిస్తాము. 10, 12 తర్వాత వారికి కెరీర్ కౌన్సెలింగ్ కూడా నిర్వహిస్తాము. పిల్లలు తమ తల్లిదండ్రులను కలవడానికి పేరెంట్ మీటింగ్ ప్రోగ్రామ్లు కూడా నిర్వహిస్తాము. కొంతమంది ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలవడానికి నియమిత బస్తీకి కూడా వెళతారు.’’ అని చెప్పారు.
గతంలో ఈ కేంద్రంలో 10వ తరగతి పిల్లలకు మాత్రమే బోధించేవారు. అయితే పెరుగుతున్న పిల్లల సంఖ్యని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు తరగతులు ప్రారంభించారు. మణినగర్లోని ఈ మున్సిపల్ పాఠశాలలోని శ్రీ గురూజీ జ్ఞాన మందిరంలో 100 మందికి పైగా పిల్లలు చదువు తున్నారు. ఖోఖ్రా, ఘోడసర్ వత్వా, బహ్రంపురా వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు వస్తారు. కొంతమంది పిల్లలు పది కిలోమీటర్లు సైకిల్పై ఇక్కడకు వచ్చి చదువుకుంటున్నారు. వాస్తవానికి శ్రీ గురూజీ జ్ఞాన మందిరం విద్య, సంస్కృతి, విజ్ఞానాల త్రివేణి సంగమం అంటే అతిశయోక్తి కాదు.