జాతీయ భద్రతా సలహా బోర్డును పునరుద్ధరించిన కేంద్రం.. చైర్మన్ గా అలోక్ జోషి

పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డుకు చైర్మన్ గా ‘‘రా’’ మాజీ చైర్మన్ అలోక్ జోషిని నియమించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పలు కీలక భేటీలు జరుగుతున్నాయి. ఈ భేటీల తర్వాతే ఈ నిర్ణయాన్ని వెలువరించారు. ఇక.. ఈ బోర్డులో భారత సైన్యంలో పనిచేసిన మాజీ అధికారులు ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, అడ్మిరల్ మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్ రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ వెంకటేశ్ వర్మ సభ్యులుగా వుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *