జాతీయ భద్రతా సలహా బోర్డును పునరుద్ధరించిన కేంద్రం.. చైర్మన్ గా అలోక్ జోషి
పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం మరో అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డుకు చైర్మన్ గా ‘‘రా’’ మాజీ చైర్మన్ అలోక్ జోషిని నియమించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పలు కీలక భేటీలు జరుగుతున్నాయి. ఈ భేటీల తర్వాతే ఈ నిర్ణయాన్ని వెలువరించారు. ఇక.. ఈ బోర్డులో భారత సైన్యంలో పనిచేసిన మాజీ అధికారులు ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, అడ్మిరల్ మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్ రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ సింగ్, మాజీ ఐఎఫ్ఎస్ వెంకటేశ్ వర్మ సభ్యులుగా వుంటారు.