హెచ్ఏఎల్ కు ‘”మహారత్న” హోదా.. 14 వ కంపెనీగా రికార్డుల్లోకి
ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు భారత ప్రభుత్వం ‘మహారత్న’ హోదా కల్పించింది. భారతదేశంలో 14వ మహారత్న కంపెనీగా హెచ్ఏఎల్ నిలిచింది. హెచ్ఏఎల్ కు మహారత్న హోదాను కల్పించడానికి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆమోదం తెలిపారని డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ తెలిపింది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) కు మహారత్న హోదా కల్పించే ప్రతిపాదనను ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలోని ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ, కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని అపెక్స్ కమిటీ గతంలో సిఫారసు చేశాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ (డిఓడిపి) సీపీఎస్ఈగా ఉన్న హెచ్ఏఎల్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.28,162 కోట్ల వార్షిక టర్నోవర్, రూ.7595 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
హెచ్ఏఎల్ భారతదేశంలో 14 వ మహారత్న కంపెనీ. మహారత్న హోదా ఉన్న ఇతర కంపెనీలు ఇవే..
1. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టిపిసి) లిమిటెడ్
2. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) లిమిటెడ్
3. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)
4. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిఏచ్ఈఎల్)
5. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)
6. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసిఎల్)
7. కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)
8. గెయిల్ ఇండియా లిమిటెడ్
9. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)
10. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
11. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్ సి)
12. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) లిమిటెడ్
13. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్)