బంగ్లాదేశ్ ఇస్లామిక్ ఛాందసులకు బుద్ధి చెప్పండి : హిందూ ఐక్యవేదిక
మైనార్టీ హిందువులను ఊచకోత కోస్తున్న బంగ్లాదేశ్లోని ఆరాచక పరిణామాలపై భాగ్యనగరం (హైదరాబాద్) అట్టుడికింది. మతోన్మాదంతో మతితప్పి, మానవత్వం మరచి ప్రవర్తిస్తున్న అక్కడి ఇస్లామిక్ మతఛాందసవాద శక్తులకు గట్టిగా బుద్ధి చెప్పితీరాలని బంగ్లాదేశ్ హిందువుల రక్షణ కోసం జరిగిన సంఘీభావ సభ పిలుపునిచ్చింది. హిందూ ధర్మ రక్షణ కోసం హిందువులంతా రోడ్లపైకి రావాలని, వక్ఫ్ బోర్డును తొలగించాలని, హిందూ-హిందూ భాయి భాయిగా కలసి పోరాడాలని ఆకాంక్షించింది. ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్ వేదికగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ ఐక్య వేదిక బుధవారం నిర్వహించిన ఈ సంఘీభావ సభలో ఇస్కాన్ సహా హిందూ పీఠాలకు చెందిన స్వాములు, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ సహా పలు జాతీయవాద సంస్థల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు. రక్తమోడుతున్న బంగ్లాదేశ్ పై ప్రపంచం దృష్టి సారించి అక్కడ హిందువులు సహా అక్కడి మైనార్టీల హక్కులను కాపాడాలని, జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. హిందువుల రక్షణ కోసం యుద్ధం చెయ్యాల్సి వస్తే ఆ యుద్ధంలో తామే ముందుంటామన్నారు.
పల్లె పల్లెలో వీధి వీధినా పోరాటం సాగాలి: భాగయ్య
సంఘీభావ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు భాగయ్య గారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ ప్రభుత్వం జైలుకు పంపిన ఇస్కాన్ స్వామి చిన్మయ్ కృష్ణ దాస్ మనోబలంతో పోరాడుతున్నారని, తప్పక విడుదలవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ హిందువులు ఆ దేశాన్ని వీడిపోకుండా పోరాడి ఆత్మగౌరవంతో అక్కడే ధైర్యంగా ఉండే రోజులు త్వరలో కచ్చితంగా వస్తాయన్నారు. గత వెయ్యేళ్ల కాలంలో ఉగ్రవాద శక్తులు అనేక దేశాలను ధ్వంసం చేసినప్పటికీ, భారత్ మాత్రమే దానిని తట్టుకుని నిలిచిందన్నారు. ఆ శక్తులు మన మందిరాలను కూల్చినా, మన తల్లులు, స్త్రీలను దారుణంగా అవమానించినా మనం తలవంచక, ఓటమిని అంగీకరించక, విజయం కోసం పోరాటాలు, బలిదానాలు చేస్తుండటమే ఇందుకు కారణమని భాగయ్య స్పష్టం చేశారు.
హిందూ సమాజం జాగృతమవుతున్నప్పటికీ, మరింత ఐక్యత, బాధ్యతతో సంఘటితం కావాలని, నేడు సుదీర్ఘ సంఘర్షణ కొనసాగుతోందని భాగయ్య సభను అప్రమత్తం చేశారు. ధైర్యాన్ని నూరిపోసిన శ్రీకృష్ణని భగవద్గీతను అనుసరించి ప్రతి పల్లె, పట్టణం, వీధి వీధినా ఈ పోరాటం సాగాలన్నారు. బంగ్లాదేశ్ హిందువుల సమైక్య పోరాటం తప్పక విజయం సాధిస్తుందంటూ ఒకనాడు జరిగిన దేశ విభజన కృత్రిమమేనని, తాత్కాలికంగా మాత్రమే విడిపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు సాంస్కృతికంగా భారతదేశపు అఖండ భూమి అని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్ హిందువులను చంపడానికి పాక్ సైన్యం వెళ్లింది… భారత్ సైనిక చర్య తీసుకోవాలి: రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ హిందువులను చంపడానికి పెద్ద ఎత్తున పాక్ సైన్యం వెళ్లినట్టు తనకు జాతీయ మీడియా ద్వారా తెలిసిందని చెప్పారు. నేడు బంగ్లాదేశ్ హిందువులను కాపాడేందుకు సైనిక చర్య చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. బంగ్లాదేశ్ ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే చేతలతోనే సాధ్యమంటూ ఇంకా నిరీక్షిస్తే అక్కడ ఒక్క హిందువు కూడా మిగిలే పరిస్థితి లేదన్నారు. బంగ్లాదేశ్లో ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్, ఆయన తరఫున వాదించే లాయర్పై దాడి, హిందువులపై హింసాకాండ పరిణామాలను ఖండించారు. ఒకనాడు బంగ్లాదేశ్ ముస్లింలపై పాకిస్తాన్ ముస్లింలు మారణకాండ జరిపినప్పుడు భారత సైన్యం రంగంలోకి దిగి బంగ్లాదేశ్ ప్రజల్ని కాపాడిన సంఘటనలను గుర్తు చేశారు.

బెంగాల్ సహా భారత్లోని పలు ప్రాంతాల్లో కోటి మందికి పైగా రోహింగ్యా ముస్లింలు దాక్కున్నారని వారికి కొన్ని ప్రభుత్వాలు మద్దతుగానూ నిలబడ్డాయంటూ రక్షణ కోసం మన సరిహద్దుల్లో నిలిచిన హిందువులను భారత్లోకి అనుమతించాలన్నారు. బంగ్లాదేశ్ పరిస్థితుల నేపథ్యంలో మున్ముందు భారతదేశంలోని హిందువులు సైతం కచ్చితంగా మరింత పోరాట పటిమను పెంపొందించుకుంటారన్నారు. భారతీయ హిందువులు నేడు కులం, రాజకీయాలలో చిక్కుకుని ఉన్నారని, గతంతో పోల్చితే హిందువుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని సర్వేలను ఉటంకిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మేమిద్దరం మాకిద్దరు అని హిందువులు సంతానాన్ని నియంత్రించుకుంటుంటే… అవతలివారు మేం ఐదుగురం మాకు ఏభై మంది అన్నట్టుగా వెళుతున్నారని హెచ్చరించారు. ఇది దేశంలో జిహాదీల సంఖ్యను పెంచడానికి తప్ప మరొకటి కాదని హెచ్చరించారు.
నాటి నిర్ణయాలే నేటి బంగ్లాదేశ్ పరిణామాలు: రాజ్యవర్ధన్ రెడ్డి
బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న మారణ కాండ, ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్ పరిణామాలను ఖండించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజ్యవర్ధన్ రెడ్డి స్పందిస్తూ పాకిస్తాన్ ఏర్పాటుకు దారి తీసిన భారతదేశ విభజన కాలంలో హిందువులకు జరిగిన ఘోర అన్యాయాలను ప్రస్తావించారు. గాంధీ, నెహ్రూ సహా నాటి కాంగ్రెస్ పెద్దలు అనాలోచితంగా చేసిన నిర్ణయాలతో నేటి బంగ్లాదేశ్తో కూడిన ఆనాటి పాకిస్తాన్లో హిందువులు, సిక్కులు చెప్పలేని దారుణాలకు గురయ్యారని, ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయని ఆవేదన చెందారు. విభజనకు ముందు రోజు వరకూ భారత్, పాకిస్థాన్ దేశాల్లో ఏ ప్రాంతాలు ఉంటాయో తెలియని పరిస్థితులతో లాహోర్, కరాచీ ప్రాంతాల్లోని హిందువులు, సిక్కులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావని నాటి పరిణామాలను గుర్తు చేశారు.
శాంతి ఒక్కటే కాదు… ఆపత్కాలంలో రక్షించుకోవాలి: త్రిదండి దేవనాథ జీయర్
బంగ్లాదేశ్ హిందువుల దైన్య స్థితి, ఇస్కాన్ సన్యాసి అరెస్ట్ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన త్రిదండి దేవనాథ జీయర్ స్వామి స్పందిస్తూ హిందూ సమాజం కోసం పోరాడుతున్న వీరులకు అభినందనలు తెలిపారు. అదే సమయంలో ధర్మశాస్త్రాలు శాంతిని ప్రబోధించినప్పటికీ ఆపత్కాలంలో రక్షించుకోవలసిన కర్తవ్యాన్ని కూడా తెలియజేశాయంటూ ఒక కథ ద్వారా కర్తవ్యాన్ని ప్రబోధించారు. సెక్యులరిజం గురించి మాట్లాడుతున్న ప్రభుత్వాలకు హైందవ దేవాలయాలపై అధికారమెందుకని నిలదీశారు. చర్చిలు, మసీదులను వదిలేసి హిందూ దేవాలయాల ఆదాయాన్ని ప్రభుత్వాలను నడిపించుకోవడానికి వాడుకుంటున్న తీరును ఖండించారు. అయితే హిందువుగా బతకాలి.. లేదంటే పోరాడి అమరులవ్వాలని పిలుపునిచ్చారు.
ఇస్కాన్ భక్తులపై తుపాకులు… మాధవ స్వామి
ఇస్కాన్కు చెందిన స్వామి మాధవ స్వామి మాట్లాడుతూ బంగ్లాదేశ్లోని ఇస్కాన్ భక్తులపై తుపాకులు గుచ్చి చంపడానికి సిద్ధంగా ఉన్నారని, జైల్లో ఉన్న ఇస్కాన్ స్వాములకు ప్రసాదంగా శాకాహారాన్ని ఇచ్చినవారిని కూడా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి పెద్దలు కూడా మాట్లాడని పరిస్థితి ఉందంటూ బంగ్లాదేశ్లో ఇస్లాం, ఇస్కాన్తో పాటు అన్ని ధర్మాలూ సహజీవనం చేసే పరిస్థితి కల్పించాలని అక్కడి ప్రధానమంత్రి యూనస్కు విజ్ఞప్తి చేశారు. మానసంరక్షణ కోసం ద్రౌపది చేసిన ప్రార్థనను మన్నించి శ్రీకృష్ణుడు కాపాడినట్లుగానే తాము ప్రార్థన చేస్తామంటూ హరేకృష్ణ నామ స్మరణ చేశారు.

హిందువుల రక్షణ కోసం స్వాముల కర్రలే కత్తులవుతాయి: శ్రీశక్తి పీఠం బెనారస్ బాబూజీ
బంగ్లాదేశ్ హిందువుల పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన శ్రీశక్తి పీఠం బెనారస్ బాబూజీ స్పందిస్తూ హిందూ దేశంగా విలసిల్లిన నేపాల్ని భారత్ నుంచి ముందుగా విడగొట్టిన బ్రిటిష్ వారు పెద్ద కుట్రకు తెరలేపారన్నారు. హిందువులకు ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ వైపు వేళ్లు చూపించి ఏం చేస్తున్నారని ప్రశ్నించడం సరి కాదని, ఈ రెండు సంస్థలు దేశం కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. హిందువుల కోసం రక్త తర్పణ చెయ్యడానికి తాను సిద్ధమన్నారు. దేశంలో హిందూ చైతన్యం పెరుగుతోందని, మతమార్పిడి అయిన వారు బాధపడుతున్నారని తెలిపారు. మన శత్రువులు మన పక్కనే ఉండి మిత్రుల్లా నటిస్తూ మనని అంతం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు. అవసరమైతే హిందువుల రక్షణ కోసం స్వాముల చేతుల్లోని దండం (కర్ర) శివాజీ మహరాజ్, ఝాన్సీ లక్ష్మిబాయి, రుద్రమదేవి స్ఫూర్తితో కత్తిగా కూడా మారుతుందన్నారు.
మహాకుంభమేళాతో హిందూ జాగృతి: స్వామి హరిదర్శన్ (స్వామి నారాయణ్ నీలకంఠ విద్యాపీఠ్)
స్వామి నారాయణ్ పీఠానికి చెందిన నీలకంఠ విద్యాపీఠ్ స్వామీజీ హరిదర్శన్ స్పందిస్తూ బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో అలహాబాద్ మహాకుంభమేళా ద్వారా హిందూ జాగృతికి శ్రీకారం చుట్టాలన్నారు. బంగ్లాదేశ్ హిందువులకు అంత అన్యాయం జరుగుతుంటే భారతదేశంలోని ముస్లింలు కనీసం స్పందించక పోవడం చూస్తే హిందూ-ముస్లిం సోదరభావం అనేది లేనే లేదని స్పష్టమవుతోందన్నారు. ఇంత ఆవేదనతో జరుగుతున్న సభకు చాలా తక్కువ సంఖ్యలో హిందువులు రావడంపై విస్మయం వ్యక్తం చేస్తూ స్వాములు ఉపదేశాలు గాక ఆదేశాలివ్వాలని పిలుపునిచ్చారు. హిందువులు రోడ్లపైకి రావాలని, వక్ఫ్ని వదిలించుకోవాలని స్పష్టం చేశారు.
ఇఫ్తార్ విందులు ఇచ్చిన ఇస్కాన్ ఆలయాలను కూల్చిన పరిస్థితి: దుర్గానందపురి స్వామీజీ
బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితుల నేపథ్యంలో ముందుగా మన దేశంలోనే తమిళనాడు, కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లోని హిందువులు, ఆలయాల పరిస్థితిని చూడాలని దుర్గానందపురి స్వామీజీ హిందువులను అప్రమత్తం చేశారు. దేశంలో హిందూ ముస్లిం బాయి బాయి అంటూ వెయ్యేళ్లుగా పాముకు పాలు పోస్తూ అదే తప్పు చేస్తున్నామని హెచ్చరించారు. ఇఫ్తార్ విందులు ఇచ్చిన ఇస్కాన్ ఆలయాలను కూల్చిన పరిస్థితి ఎదురైందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు రామాయణ, భారత, భగవద్గీతలను బోధించక, ధర్మాన్ని తెలియజేయని పరిస్థితుల ఫలితమే నేటి పరిణామాలని చెప్పారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం వేలాది మంది సైనికుల్ని భారత్ కోల్పోయిన పరిస్థితిని గుర్తు చేశారు. హిందువులకు గోవు ఆరాధ్యదైవం కావడమే ఆవుకు శాపమైందని, అందువల్లే అన్యమతస్తులు గోవుపై కక్ష కట్టారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య వీరుల బలిదానాన్ని గౌరవించి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటేనే భారత్ సహా యావత్ ప్రపంచం నిలబడుతుందన్నారు.

యూనిస్కి ఇచ్చిన నొబెల్ శాంతి బహుమతిని రద్దు చేయాలి..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బర్ల సుందర్ రెడ్డి మాట్లాడుతూ హిందువులకు అన్యాయం చేసినవారు కనుమరుగయ్యేలా మన ప్రతిక్రియ ఉండాలన్నారు. బంగ్లాదేశ్కి చైనా, పాకిస్తాన్ తోడయ్యాయని హెచ్చరించారు. క్రిమినల్ కేసులున్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి యూనిస్కి గతంలో ఇచ్చిన నొబెల్ శాంతి బహుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ ఐక్య వేదిక నిర్వహించిన ఈ “బంగ్లాదేశ్ హిందువుల రక్షణ సంఘీభావ సభ”లో వందలాదిగా హిందువులు పాల్గొని విజయవంతం చేశారు.