ఆస్ట్రేలియాలోని హిందూ దేవాలయాలపై దాడులు… విగ్రహాలు ధ్వంసం

ఆస్ట్రేలియాలోని రెండు హిందూ దేవాలయాలపై దుండగులు దాడి చేశారు. ఛాందసులు దోపిడీకి కూడా పాల్పడ్డారు. అయితే మొత్తం నలుగురు తమ మొహాలకు నలుపు రంగు వస్త్రాలు చుట్టుకొని ఈ విధ్వంసం సృష్టించారు. ముందు దేవాలయం తలుపులను బద్దలు కొట్టారు, ఆ తర్వాత హుండీలను పగులగొట్టారు.
ఈ హుండీల్లో డబ్బులున్నాయి. ఈ దేవాలయ విధ్వంసం తమనెంతో కలవర పెట్టిందని, చాలా బాధపడుతున్నామని హిందూ దేవాలయాల బాధ్యులు తరుణ్ అగస్తీ అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీనికి తాము కూడా సహకరిస్తామన్నారు. మత ఛాందసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, హిందువుల ఆత్మగౌరవం, హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీయడమే అవుతుందని, సామరస్యం కూడా దెబ్బతింటుందన్నారు.
ఈ దేవాలయం తర్వాత కాన్ బెర్రాలోని శ్రీవిష్ణు శివ మందిరంపై కూడా దుండగులు దాడి చేశారు. ఈ దేవాలయంలో కూడా దుండగులు హుండీలను ధ్వంసం చేసి, అందులోని నగదును ఎత్తుకెళ్లారు. శివలింగాన్ని ధ్వంసం చేయడంతో పాటు దేవాలయ అల్మారాలోని దేవతలను వస్త్రాలను కూడా చిందర వందర చేసేశారు. హిందూ దేవాలయాలకు ప్రభుత్వం భద్రత కల్పించాలని అక్కడి హిందువులు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *