హిందూ దేవాలయంపై దాడిని నిరసిస్తూ కెనడాలో హిందువుల భారీ ర్యాలీ

కెనడాలోని బ్రాంప్టన్ లో హిందువులు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడి దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వేలాది మంది హిందువులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. హిందువులపై జరుగుతున్న హింస, దాడులను వెంటనే నిరోధించాలని, ఇందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ సంఘీభావ ర్యాలీకి అక్కడి రాజకీయ నాయకులు, ఇతర సంఘాలు మద్దతిచ్చారు. అక్కడి లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఖలిస్తానీలకు ఇక మద్దతివ్వద్దని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కోయలిషన్ ఆఫ్ హిందూస్ ఆఫ్ నార్త్ అమెరికా అనే సంస్థ తన సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ సందర్భంగా కెనడాలోని హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ… వెంటనే ఆపాలని సూచించారు. అలాగే దేశంలో హిందూ ఫోబియాను వెంటనే ఆపాలని పిలుపునిచ్చారు.
బ్రాంప్టన్ లోని హిందూ సభ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. దేవాలయంలోకి ప్రవేశించి మరీ అక్కడి భక్తులపై దాడిచేశారు. ఈ సమయంలో చిన్న పిల్లలు కూడా మందిరంలోనే వున్నారు. అయినా ఖలిస్తానీ ఛాందసులు దాడి చేస్తూనే వున్నారు. ఈ దాడి అత్యంత ఘోరంగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
ఖలిస్తానీలు దాడి చేసిన విషయాన్ని భారత సంతతికి చెందిన కెనడా ఎంపీ చంద్రశేఖర్ ఆర్య వెల్లడించారు. కెనడా రాజకీయాల్లోనే కాకుండా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల్లోకి కూడా అతివాద ఖలిస్తానీలు చొరబడ్డారన్న విషయాన్ని తాము పదే పదే చెబుతున్నామని, ఇప్పుడు నిజమైందన్నారు. మరోవైపు ఇంత దాడి జరిగినా ప్రధాని ట్రూడో పొడిపొడిగానే స్పందించడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.హిందువులు ముందుకు వచ్చి, తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *