హైదరాబాద్ నగరంలో పచ్చదనం కోసం హెచ్‌ఎండీఏ ప్రణాలికలు

రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే విపరీతమైన కాలుష్యం పెరిగిపోతోంది. రోజు రోజుకీ వాహనాల కాలుష్యం, పరిశ్రమల కాలుష్యం… ఇలా రకరకాల కాలుష్యలతో ప్రజలు నానా ఇబ్బందులు, అనారోగ్యాలకు పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ అధికారులు పచ్చదనాన్ని మరింత పెంచాలని ప్రణాళికలు సిద్దం  చేశారు. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో కొత్తగా మరో 29 ఉద్యానవనాలను నిర్మించాలని భావిస్తున్నారు . దీని కోసం 46 కోట్లను సిద్దం  చేశారు. గ్లోబల్‌ ర్యాంకింగ్‌లో హైదరాబాద్‌ 12.9 శాతం పచ్చదనంతో వుండగా…. దీనిని 33 శాతానికి పెంచాలన్నది అధికారుల ప్రణాళిక. దీనిలో భాగంగా గ్రేటర్‌ వ్యాప్తంగా కొత్తగా 29 పార్కులను నిర్మించనున్నారు. శంషాబాద్ లో  30 ఎకరాలు, తెల్లాపూర్‌లో 20 ఎకరాలు, శివార్లలో మరో 20 ఎకరాల్లో కొత్త పార్కులు రానున్నాయి . మరోవైపు కొన్ని కొన్ని కాలనీల్లో పార్కులు వున్నా… అక్కడ జిమ్‌ యంత్రాలు, వాకింగ్‌ కోసస మాత్రమే తగిన ఏర్పాట్లున్నాయి కానీ… పచ్చదనం విషయంలో మాత్రం చాలా తక్కువ చర్యలు తీసఱకుంటున్నారు. దీంతో వీటికి కూడా హెచ్‌ఎండీఏ ప్రణాళికలు వేసుకుంది. కొత్త కొత్త కాలనీలు, ఎంపిక చేసిన  కాలనీల్లో కూడా పచ్చదనాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *