భారతీయతే మన అస్తిత్వం

మతమార్పిడి చర్చ్‌ మద్దతు, అభారతీయ కమ్యూనిస్ట్‌ సిద్ధాంతపు ప్రభావం కలిగిన  నాయకులు కొందరు భారతదేశ పేరుప్రతిష్టలు, అస్తిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ప్రకటనలు చేయడం ఎంతో బాధాకరం. బాగా చదువుకున్న ఇలాంటి నేతలు చేసే ప్రకటనలు చూస్తూ ఉంటే మాజీ రాష్ట్రపతి డా.ఎస్‌. రాధాకృష్ణన్‌ చెప్పిన ఒక మాట గుర్తుకువస్తుంది. 1949 విద్యాసంఘం నివేదికలో డా. రాధాకృష్ణన్‌ మన దేశంలో (ఆంగ్ల)విద్యకున్న అభారతీయ లక్షణాన్ని గురించి ఇలా వ్రాసారు – ‘‘శతాబ్ద కాలంగా మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే, అది భారతదేశపు గతాన్ని పూర్తిగా విస్మరించింది. భారతీయ విద్యార్ధులకు తమ సొంత సంస్కృతి గురించిన జ్ఞానం ఏమాత్రం కలిగించడం లేదు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మనకి చెప్పుకోదగిన మూలాలు లేనేలేవని అనిపించేట్లు చేస్తోంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అంతకంటే దారుణంగా,అసలు చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం కలవకుండా మన మూలాలే అడ్డుపడుతున్నాయనే భావం కలిగిస్తోంది ఈ విద్యావ్యవస్థ’’.

అభారతీయ కమ్యూనిస్ట్‌ ఆలోచనలు, భావాలు మనలో ఎంతగా పాతుకుపోయాయంటే, మన ఆలోచనా విధానమేకాదు, మన భాష, ఉపయోగించే మాటలు కూడా అలాగే ఉంటున్నాయి.  హిందూ పాకిస్తాన్‌, హిందూ తాలిబాన్‌, హిందూ తీవ్రవాదం అనే పదాలు పూర్తిగా అభారతీయమైనవి. వీటిలో ‘హిందూ పాకిస్తాన్‌’ అనే మాట పూర్తిగా విరోధా భాసాలంకారం (oxymoron). ఈ అర్ధంలేని ప్రకటన గురించి చర్చించడానికి ముందు అసలు భారత్‌ అంటే ఏమిటో, హిందుత్వ అంటే ఏమిటో అర్ధం చేసుకోవాలి.

 నాగపూర్‌లో మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి డా.ప్రణబ్‌ ముఖర్జీ ‘‘యూరోప్‌లో జాతి – రాజ్య భావన వికసించకముందే భారత్‌ ఒక రాజ్యంగా విలసిల్లింది. పరిమిత భూభాగం, ఒకే భాష, మతవిశ్వాసాలు, సమాన శత్రుమిత్ర భావన అనే అంశాలపై యూరోప్‌లో జాతి – రాజ్యాలు ఏర్పడ్డాయి. మరోవైపు భారతీయ జాతీయవాదం ‘వసుధైవ కుటుంబకం’, ‘సర్వేభవంతు సుఖినః సర్వేసంతు నిరామయ’ అనే వైశ్విక భావాల ఆధారంగా ఏర్పడిరది. ఈ వైశ్విక ద ృష్టికి మూలం భారతీయ తత్వచింతనలో ఉంది. మనం సర్వప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూస్తాం. అందరి సుఖశాంతులు కోరుకుంటాం.  మతవిశ్వాసాలు, భాషలో వివిధత్వమే భారతదేశ ప్రత్యేకత. మనది కేవలం ‘సహిష్ణుత’ కాదు. ఇతరులపట్ల ‘గౌరవం’, ‘అంగీకారం’. మనం వివిధత్వాన్ని అంగీకరిస్తాం, గౌరవిస్తాం. ఆ వివిధత్వానికి గర్విస్తాం. శతాబ్దాలుగా ఇదే మన సామూహిక చింతన అయింది. కనుక మన జాతీయవాదాన్ని మూఢత్వం, మతగుర్తింపు, ప్రాంతీయ తత్వం, అసహనం, ద్వేషం ఆధారంగా నిర్వచించాలనుకోవడం దానిని పలుచన చేయడమే అవుతుంది.’’

ఈ సహనశీల, సమన్వయపూర్వక, సంపూర్ణ, సమైక్య ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొందరు నిరాకరించడం వల్లనే పాకిస్తాన్‌ ఏర్పడిరదనే సంగతి కాంగ్రెస్‌ నేతలు మరచిపోయారు. ఈ మరపుకు కారణం అభారతీయ విద్యావిధానం, అభారతీయ మైన కమ్యూనిస్టు ఆలోచనల ప్రభావం. భారతదేశం హిందుత్వ జీవనవిధానంతో ముడిపడి ఉన్నంత కాలం అది పాకిస్తాన్‌గా మారదు. ఈ హిందూత్వాన్ని నిరాకరించడం వల్లనే పాకిస్తాన్‌ ఏర్పడిరది.

నిజానికి సహనశీలమైన, విశాలమైన ఈ ఐదు వేల సంవత్సరాల పురాతన సంస్కృతి వల్లనే వివిధత్వం విలసిల్లింది. చివరికి పాకిస్థాన్‌ లో కూడా ఇదే జీవనధార కనిపిస్తుంది. ఈ సుసంపన్నమైన వారసత్వం నుండి వేరుపడిరది కాబట్టే పాకిస్థాన్‌ అలా అయింది. మళ్ళీ ఈ సనాతన స్రవంతిలో కలిస్తే ఇస్లాం ప్రార్ధనా పద్దతిని వదిలిపెట్టకపోయినా పాకిస్థాన్‌ హిందూ మూలాలను కాపాడుకోవచ్చును. ఎం.సి. చాగ్లా, ఎ.పి.జె. అబ్దుల్‌ కలాం, పాకిస్థాన్‌లో జన్మించి, ప్రస్తుతం కెనడాలో జీవిస్తున్న తారేక్‌ ఫతే వంటివారు ఇస్లాం మతాన్ని అనుసరించినా తమ హిందూ వారసత్వ సంబంధాన్ని తెంచుకో లేదు. అలాగే పాకిస్థాన్‌ కూడా ముస్లిం దేశంగా ఉంటూనే ఈ సహన శీలమైన, విశాలమైన సంస్కృతితో ముడిపడితే అప్పుడు అది ‘హిందూ పాకిస్థాన్‌’ అవుతుంది. మరోలా చెప్పాలంటే అది ‘భారత్‌’ అవుతుంది. రాజకీయమైన ప్రత్యేక హోదాను నిలబెట్టుకుంటూనే అలా మారవచ్చును. ఇదే భారతీయ దృక్పధం. సార్వభౌమాధికారం కలిగిన స్వతంత్ర  దేశమైనా నేపాల్‌ ఈ సాంస్కృతిక – ఆధ్యాత్మిక పరంపరతో తనను తాను జోడిరచి ఉంచుకుంది. అందువల్లనే భారత్‌, నేపాల్‌ ల మధ్య ప్రవేశ ఆంక్షలు ఏమిలేని సరిహద్దులు ఏర్పడ్డాయి.

ఈ సాంస్కృతిక మూలాలే భారతదేశపు అస్తిత్వం. ఈ అస్తిత్వాన్నే హిందూత్వం లేదా హిందూ జీవన విధానం అని డా. రాధాకృష్ణన్‌, గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ లు అభివర్ణించారు. ‘హిందూ’ అనే మాట పట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు ‘భారతీయ’ లేదా ‘ఇండిక్‌’ అనే పదాలు ఉపయోగించవచ్చును. ఏ పదం ఉపయోగించినా ఆధ్యాత్మికత ఆధారంగా వికసించిన సమీకృత, సంపూర్ణ జీవన విధానమే మన వారసత్వం అనే సత్యం మాత్రం మారదు. సత్యం ఒకటే అయినా దానిని వివిధ పేర్లతో పిలవవచ్చును అనేదే భారతీయ చింతన సారాంశం. అదే అత్యంత కీలకమైన, ప్రధానమైన అంశం.

 ఎప్పుడైతే ఈ సంప్రదాయంతో సంబంధం పలచబడుతుందో అప్పుడు మన ఆలోచనలోను, మాట్లాడే మాటలోను తేడా వస్తుంది. ఈ మరపు మరింత తీవ్రమైతే పెదార్ధాలు పెరుగుతాయి. ‘నేను ఏదైనా కావచ్చునుకానీ హిందువును మాత్రం కాను’అనే వరకు వెళుతుంది. ఆ తరువాత రాజకీయాలు వస్తాయి. మూలాలు మరింత దూరమైతే అప్పుడు ఇక హిందూ పాకిస్తాన్‌, హిందూ తాలిబాన్‌, హిందూ తీవ్రవాదం వంటి అర్ధంలేని ఆలోచనలు వస్తాయి. చివరికి అస్తిత్వాన్ని పూర్తిగా మరచిపోవడంతో అభారతీయ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు ‘భారత్‌ తేరే టుక్డే హోంగే, భారత్‌ కీ బర్బాదీ తక్‌ జంగ్‌ చలేగి, జంగ్‌ చలేగి’ వంటి నినాదాలు పుట్టుకువస్తాయి. ఈ నినాదాలు చేసినవారు నిరక్షరాస్యులు, వెనుకబడినవారు, నిరుపేదలు కారు.

వీళ్ళంతా ఆధునిక భారతీయ మేధోవర్గానికి యువ ప్రతినిధులు. వీళ్ళంతా ‘అత్యంత ప్రగతిశీల, ఆధునిక’ విద్యా సంస్థల నుంచి వచ్చినవారు. ఏ దేశాన్ని తిట్టిపోస్తున్నారో అదే దేశం నుంచి జీతాలు, ఇతర సదుపాయాలు పొందుతున్న విద్యావేత్తలు, మేధావుల మద్దతు వీరికి ఉంది. విద్య ద్వారా జరుగుతున్న అభారతీయకరణకు ఇంతకంటే మించిన ఉదాహరణ ఉంటుందా?

ఓ వృక్షమా! నేలను వదిలిపెడుతున్నావెందుకు? ఎండిపోతావు

నీ వేళ్ళు నేలలోకి ఎంత లోతుకు వెళితే నువ్వు అంత పచ్చగా ఉంటావు

– డా.మన్మోహన్‌ వైద్య

సహ సర్‌ కార్యవాప్‌ా (సంయుక్త కార్యదర్శి) రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *