655 రైతు కుటుంబాలు సేంద్రీయ పద్ధతిలో పంటలు సాగు చేయడం హర్షణీయం : ఉపరాష్ట్రపతి

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగు రైతు సమ్మేళనం జరిగింది. 800 మంది రైతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ధన్కర్ మామిడి మొక్కను నాటారు. అనంతరం సేంద్రీయ ఉత్పత్తులు, ఎరువులు, జీవామృతం, వివిధ కషాయాల స్టాల్స్ ను పరిశీలించారు. అక్కడే మహిళా రైతులు గిరిజన సంప్రదాయ నృత్యం చేయగా ఉపరాష్ట్రపతి కూడా వారితో కలిసి స్టెప్పులేశారు. ఈ ఘటన అందర్నీ ఆకర్షించింది. అనంతరం కేవీకే శాస్త్రవేత్తలతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం, ఆధునికత, విస్తరణ విషయాలను చర్చించారు.

ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ధన్కర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 655 రైతు కుటుంబాలు సేంద్రీయ పద్ధతిలో పంటలు సాగు చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. జిల్లాలోని సేంద్రీయ రైతులందరూ మూడు రోజుల పాటు ఢిల్లీలో తన నివాసానికి అతిథులుగా రావాలని ఆహ్వానించారు.ఈ తునికి గ్రామం చిన్నది కాదని, తనకు మార్గదర్శనం చేసిన గ్రామమని కొనియాడారు. మెదక్ జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం చేసిన రైతులు, గ్రామ పంచాయతీ సభ్యులు తన ప్రత్యేక అతిథులని, వారికి ఢిల్లీలో ఆతిథ్యం ఇస్తానన్నారు., గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానికి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అని ఊతమిచ్చారని, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అన్న నినాదంతో మోదీ కృషి చేస్తున్నారన్నారు. రాబోయే కొద్ది రోజులలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతోందని తెలిపారు.

దేశంలోని 730 పైచిలుకు కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. 150 పై చిలుకు ఐకార్ సంస్థలు కిసాన్ దివస్ రజతోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో రైతుల భాగస్వామ్యం ఉంటేనే దేశం పురోభివృద్ధి చెందుతుంది అన్నారు. దేశంలోని ఇంధన, సహజ వనరులను అవసరం మేరకే వినియోగించుకోవాలి అని రైతులకు సూచించారు. గ్రామీణ వ్యవస్థలో తమ గ్రామాల్లో పండించిన పండ్లు, కూరగాయలను ఒక యూనిట్ గా ఏర్పాటు చేసుకుని అక్కడే వినియోగించుకోవాల అని ఆ ప్రాంతంలోనే విక్రయిస్తే ఆ గ్రామ వ్యవస్థ ఆర్థికంగా బాగుపడుతుంది అని సూచించారు. దేశంలో అనేకమంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నా అనుకున్న విధంగా సాగులో మార్పులు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో దాదాపు 10 కోట్ల మంది రైతులు ఉన్నారు.. ప్రభుత్వం కల్పించే సంక్షేమ ఫలాలు రైతులకు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యతను మరవద్దు అని రైతులు ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీలపై ఆధారపడకుండా సోలార్ ఎనర్జీ పై రైతులకు అవగాహన కల్పించాలి అని అధికారులకు సూచించారు. భారతదేశ రైతులు సాగులో ప్రపంచంలోనే శ్రేష్టమైన రైతులుగా ఎదిగేందుకు కెవికే, ఐకార్ లు కృషి చేయాలి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్వదేశీ నినాద స్ఫూర్తితో ప్రధాని మోదీ ఫోకల్ ఫర్ లోకల్ పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. 1989 లో విదేశీ మారక ద్రవ్య నిలవల్తో పొలుచుకుంటే ఇప్పుడు భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వ 700 రేట్లు పెరిగింది అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు తరచూ రైతులతో చర్చించి, వారి సమస్యలకు పరిష్కారం చూపాలి అన్నారు.ప్రతి భారతీయుడు జాతీయ వాదంపై విశ్వాసం ఉంచాలి అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *