ఉగ్రవాదులతో సంబంధమున్న ఉద్యోగులపై వేటు

ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తొలగించారు. ఈ ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఈ ముగ్గుర్ని తొలగించారు. ఎల్జీ మనోజ్ సిన్హా అధ్యక్షతన జమ్మూ కశ్మీర్ లో భద్రతా సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో జమ్మూ కశ్మీర్ ఉన్నత ఉద్యోగులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాతే ముగ్గురు ఉద్యోగులను తొలగించారు.

ఇస్లామిక్ ఉగ్రవాదుల కనుసన్నల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యవస్థల్లో పేరుకుపోయిన వారిపై కన్నేయాలని, వెంటనే గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించాలని, మట్టుబెట్టడానికి చర్యలను ముమ్మరం చేయాలని ఎల్జీ అధికారులను ఆదేశించారు.

ఇస్లామిక్ ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్న వారు, వారి లక్ష్యాల కోసం పనిచేసే వారిపై కన్నేయాలని, వారు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మనోజ్ సిన్హా ఈ సమావేశంలో అధికారులతో అన్నట్లు తెలుస్తోంది.‘‘ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారు, వారి లక్ష్యాల కోసం పనిచేసేవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన ఉద్యోగులు అలా కాకుండా, ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్నారని ,ఇది మంచిది కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *