40 ‌గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన ‘‘కౌముఖి సేవాధామ్‌’’

‌దేవ్‌పహారి, ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నుండి 60 కి.మీ దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం. 18ఏళ్ల క్రితం దేవ్‌పహరి చేరుకోవడం హిమాల యాలను అధిరోహించినంత కష్టం. ఈ గ్రామం చేరుకోవడానికి ట్రెక్కింగ్‌ ‌చేస్తూ మూడు లోయలు దాటాలి. సుమారు 2 రోజుల సమయం పడుతుంది. దేవ్‌పహరీ మాత్రమే కాదు, కోర్బా జిల్లాలోని లెమ్రు, దిదసరాయ్‌, ‌జటాదాద్‌తో సహా 40 గ్రామాలకు చేరుకోవడానికి రోడ్డు, రవాణా వ్యవస్థ ఉండేది కాదు. చదువుకోవడానికి పాఠశాల లేదు, వైద్యం కోసం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వైద్యుడు లేని పరిస్థితి. ఇప్పటికీ కరెంటు సరఫరా పక్రియ కొనసాగుతోంది. పాండో, బిర్హోర్‌, ‌కోర్వా, కన్వర్‌ ‌తెగలకు చెందిన ఇక్కడి ప్రజలు అనారోగ్య సమస్యలకు అటవీ ఉత్పత్తులపై ఔషదాలపై ఆధారపడి జీవించేవారు. వారిపై నక్సలైట్ల భీభత్సం జీవితాన్ని మరింత కష్టతరం చేసింది. నక్సలైట్ల ఎదిగిన పంటను నాశనం చేసేవారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ గిరిపుత్రులను సమాజంలోని ప్రధాన స్రవంతితో అనుసంధానించ డానికి స్థానిక స్వయంసేవకులు చొరవ తీసుకు న్నారు. సరిగ్గా 22 సంవత్సరాల క్రితం, 15 సెప్టెంబర్‌ 2000‌న, నానాజీ దేశ్‌ముఖ్‌ ‌జీ స్ఫూర్తితో, దేవ్‌పహారిలో ‘‘గౌముఖి సేవాధామ్‌’’ ‌నుస్థాపిం చారు. దేవ్‌పహారిని కేంద్రంగా సమీపంలోని 40 గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. బన్వారీ లాల్‌ అగర్వాల్‌, ‌కిషోర్‌ ‌బుటోలియా, డా. ధృవ్‌ ‌బెనర్జీ, పిఎన్‌ ‌శర్మ వంటి సంఘ్‌ ‌స్వయం సేవకులు, సేవాదృక్పథం ఉన్న ఇందు జీ వంటి మహిళలు ఇక్కడ కొన్నాళ్లు జీవితాన్ని గడిపి 40 గ్రామాల్గో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ సంస్థ వనవాసీలకు అధునాతన వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించడమే కాకుండా వారి ఆదాయాన్ని పెంచడానికి అన్ని చర్యలను కూడా తీసుకుంది. పిల్లల చదువుకు ఓ పాఠశాలను, ఒక ఆసుపత్రిని కూడా ప్రారంభించారు. యువతకు ఉపాధి కోసం శిక్షణ ఇచ్చి, మహిళలకు ఆత్మగౌరవంతో జీవించడం నేర్పారు.

ఏకలవ్య విద్యా మందిర్‌, ‌సేవాధామ్‌ ‌నిర్వహి స్తున్న ఉన్నత పాఠశాల వందలాది గిరిజన పిల్లలకు చదివించి వారి భవిష్యత్తును మంచి మార్గాన్ని చూయించింది. నేటికీ 300 మంది పిల్లలు పాఠశాల హాస్టల్‌ ‌మమత్వ మందిర్‌లో వుంటూ చదువుతు న్నారు. పాఠశాలలో ఇప్పటివరకు 1000 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ సంస్థ ఇక్కడ చదువు తున్న పిల్లల్లో సేవా భావాన్ని కూడా నింపింది. ఇక్కడే ఉండి చదువుకుని ఇప్పుడు ప్రిన్సిపాల్‌గా ఉన్న పురుషోత్తం వురవాన్‌ ‌తనలాంటి పిల్లలను ప్రోత్సహించడంలో నిమగ్నమై ఉన్నాడు.

ఇక్కడి ప్రజలు తమ దేవుడిగా భావించే డాక్టర్‌ ‌దేవాశిష్‌ ‌మిశ్రా గారు, అతని భార్య డాక్టర్‌ ‌సరిత గారు గత 18 ఏళ్లలో ఈ కఠినమైన అడవి మధ్యలో ఉన్న చిన్న ఆస్పత్రి ఆరోగ్య మందిర్‌లో వందలాది మందికి జీవితాన్ని ప్రసాదించారు. ఈ ఆస్పత్రి ద్వారా ప్రతి సంవత్సరం లక్షలాది మందులు ఉచితంగా అందజేస్తున్నారు. సంస్థ కార్యదర్శి, సంఘ్‌ ‌స్వయంసేవక్‌ అయిన గోపాల్‌ అగర్వాల్‌ ‌మాట్లాడుతూ – ఇంతకుముందు ప్రజలు రోగిని మంచం లేదా సైకిల్‌పై తీసుకువచ్చేవారు, ఇప్పుడు 24 గంటలు ఆస్పత్రి అంబులెన్స్ అం‌దుబాటులో ఉంటుంది. ఇప్పుడు ప్రతి 15 రోజులకు చుట్టు పక్క గ్రామాల్లో వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తు న్నారు. దీనివల్ల పిల్లల్లో పోషకాహార లోపం సమస్య పరిష్కారమయింది. అంతేకాకుండా ‘మాతా, శిశ’ మరణాలు కూడా తగ్గాయి.

సొంత పవర్‌ ‌హౌస్‌ ‌ను ఏర్పాటు చేసుకోవడం గౌముఖి సేవా ధామ్‌ ‌విజయాలలో ప్రముఖమైనది. చోర్నయి నదిపై ఒక చిన్న ఆనకట్టను నిర్మించడం ద్వారా, హైడ్రో-ఎలక్ట్రిసిటీ ద్వారా ప్రతిరోజూ 5 ఖఔ విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. ఇది హాస్టళ్లు, ఆస్పత్రులతోసహా కార్యకర్తల ఇళ్లకు కూడా సరిపో తుంది. కాగా నేటికీ ఈ ప్రాంతానికి కరెంటు తీగలు కానీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ‌టవర్‌ ‌కానీ రాలేదు. సంస్థ ప్రెసిడెంట్‌ ఇం‌దుజీ ప్రకారం, పరిస్థితుల ప్రభా వంతో బాధపడుతూ నక్సలిజం మార్గంలో నడిచే వారికి సంతోషకరమైన, స్వావలంబనతో కూడిన జీవితాన్ని అందించడం ద్వారా సేవాధామ్‌, ‌కోర్బాను బస్తర్‌ (‌నక్సలిస్టు ప్రాంతం) కానీయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *