హైదరాబాద్ వేదికగా అతిపెద్ద ‘‘కిసాన్ అగ్రి షో 2025’’
హైదరాబాద్ వేదికగా అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన (కిసాన్ అగ్రి షో 2025) ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు దీనిని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మందికి పైగా సందర్శకులు వస్తారని అంచనాలు వేస్తున్నారు. ఈ నెల 7 నుంచి 9 వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరుగుతుంది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు ఒకే వైదిక పైకి వస్తారు. ఫలితంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని నిపుణులు అన్నారు.
సుమారు 150 కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. వ్యవసాయానికి చెందిన తాజా ఉత్పత్తులు, వినూత్న ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మొదటి రెండు సార్లు ఈ షో చాలా విజయవంతమైంది. ఈ సారి కూడా విజయవంతం అవుతుందని భావిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో వ్యవసాయం, ఉద్యానవన శాఖలు పాల్గొంటున్నాయి. రైతులకు అత్యుత్తమమైన, ప్రయోజనకరమైన విధానాలు, పథకాలను ప్రదర్శిస్తారు. ప్రదర్శనకారులు తమ వినూత్న ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తారు. వ్యవసాయ రంగంలో మేధో సంబంధమైన మార్పిడికి ఇది వేదిక కానుంది.
ప్రదర్శనలో ఆకట్టుకున్న ‘‘ఫార్మ్ రోబో’’
అగ్రి షో ప్రదర్శనలో ‘ఫార్మ్ రోబో’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిమోట్తో నడిచే, రూ.4.5 లక్షల ధర కలిగిన ఈ వ్యవసాయ రోబో(చిన్న పాటి ట్రాక్టర్ తరహా)తో గొర్రు కొట్టడంతో పాటు హ్యాండ్ గన్, స్వీప్ స్ర్పేయర్లతో పురుగుమందులు చల్లవచ్చు. జీపీఎస్ నావిగేషన్తో మ్యాపింగ్ ఇస్తే 700 మీటర్ల పరిధి వరకు వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు పురుగుల మందు చల్లే డ్రోన్లు, వరి నాటు మిషన్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
వ్యవసాయరంగంలో వస్తున్న ఆధునిక యంత్రాలను రైతులకు సబ్సిడీతో అందించడంతో పాటు హార్టికల్చర్ రైతులను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మాదాపూర్ హైటెక్స్లో మూడు రోజుల ‘కిసాన్ అగ్రి షో-2025’(వ్యవసాయ పనిముట్లు, ఉత్పత్తుల ప్రదర్శన)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్రాల్లో వ్యవసాయ సీజన్ ఆరంభంలో అగ్రి షోలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో నిర్వహించే అగ్రి షోలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు, రోబోల వినియోగాన్ని పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. ఉత్పాదకతను పెంచేందుకు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక త, ఆవిష్కరణలు ఆవరసరమన్నారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులకు ఆయా మండలాల్లో పండించే అన్ని పంటలపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలని అన్నారు.
కిసాన్ అగ్రి షో 2025 – విశేషాలు:
1. ఈ ప్రదర్శన 12,000 చదరపు మీటర్ల భారీ ప్రాంగణ విస్తీర్ణంలో మూడు రోజుల పాటు జరుగుతుంది. దాదాపు 150 కంపెనీలకు పైగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాయి.
2. వ్యవసాయంలో తాజా ఉత్పత్తులు, వినూత్న ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించబడతాయి.హైదరాబాద్లో కిసాన్ వ్యవసాయ ప్రదర్శన యొక్క మొదటి రెండు ఎడిషన్లు విజయవంతంగా ముగిశాయి. ఈ మూడవ ఎడిషన్కు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని భావిస్తున్నారు.
3. ఇందులో వ్యవసాయం, ఉద్యానవన శాఖ మరియు ఇతర విభాగాలు పాల్గొంటున్నాయి. వారు రైతులకు అత్యుత్తమమైన, ప్రయోజనకరమైన విధానాలు, పథకాలను ప్రదర్శిస్తారు.
4. కిసాన్ హైదరాబాద్ 2025 ప్రదర్శనకారులు తమ వినూత్న ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడానికి ఇది వేదిక కానుంది.
ఈ తరహా ప్రయత్నం పరిశ్రమలోని అధునాతన పరిణామాలను పంచుకోవడానికి, చర్చించడానికి వీలుగా వాతావరణాన్ని నెలకొల్పుతోంది. తద్వారా స్థానిక ప్రగతిశీల, ఉత్తమ రైతులు సమావేశమవుతారని నిర్వహకులు భావిస్తున్నారు.
5. నెట్వర్కింగ్ తో పాటు వ్యవసాయ రంగంలోని విజ్ఞాన మార్పిడికి అగ్రి కిసాన్ షో ప్రధాన వేదికగా మారనుంది.
6. కిసాన్ ప్రదర్శనలో వ్యవసాయ యంత్రాలు, నీరు-నీటిపారుదల, ప్లాస్టికల్చర్, సురక్షిత సాగు, వ్యవసాయంలో సాంకేతికత, కాంట్రాక్ట్ వ్యవసాయం వంటి వాటి అంశాలు చర్చకు వస్తాయి.
7. ఈ అతిపెద్ద ప్రదర్శన ద్వారా రైతులకు వారి ఆసక్తి ఉన్న విషయాలను తెలిపే వీలు ఉండటంతో పాటు ప్రోత్సహించడానికి కూడా సహాయపడుతుంది.