అపారమైన పరాక్రమానికి రాజధాని సియాచిన్
దేశానికి ఢిల్లీ జాతీయ రాజధాని అయితే, ముంబై ఆర్థిక రాజధాని, అలాగే టెక్నాలజీకి బెంగళూరు. కానీ… ధైర్య సాహసాలకు, దృఢ సంకల్పానికి, అపారమైన పరాక్రమానికి రాజధాని సియాచిన్. దట్టమైన మంచు పడే ఈ ప్రాంతంలో దేశ సైనికులు రక్షణ కోసం అత్యంత ధైర్య సాహసాలతో విధులు నిర్వహిస్తున్నారు. సియాచిన్ సాధారణ భూమి కాదు. దేశ సార్వభౌమత్వానికి, సంకల్పానికి ప్రతీక ఈ భూమి. 1984 ఏప్రిల్ 13న సియాచిన్లో భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ దేశ సైనిక చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. ఆపరేషన్ మేఘదూత్ మనందరికీ గర్వకారణం. వీర సైనికుల త్యాగల వల్లే దేశంలోని ప్రతి పౌరుడు సురక్షితంగా వున్నాడు.
-రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్